inputs
stringlengths
18
126
targets
stringlengths
309
1.76k
template_id
int64
1
7
template_lang
stringclasses
1 value
స్వీట్కార్న్ పలావ్ ఎలా తయారు చేస్తాం?
స్వీట్కార్న్ పలావ్ కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి : 1. బాస్మతీ రైస్ - కప్పు 2. నీళ్లు - 1-1/2 కప్పు 3. స్వీట్కార్న్ - కప్పు 4. బఠాణీలు- కప్పు,  ఉల్లిపాయ - 1 5. అల్లం - ముక్క 6. పచ్చిమిరప -1 7. వెల్లుల్లి రెబ్బలు - 4 8. నూనె - 2 టేబుల్ స్పూన్లు 9. గరం మసాలా - పావు స్పూన్ 10. పసుపు - చిటికెడు 11. దాల్చిన చెక్క - చిన్న ముక్క 12. యాలకులు- 2 13. ఉప్పు 14. కారం - తగినంత 15. నిమ్మరసం- కొద్దిగా 16. పుదీనా ఆకులు - కొన్ని 17. బిర్యానీ ఆకులు - 2 తయారీ : 1. ఉల్లిపాయ, అల్లం, పుదీనా, పచ్చిమిరప, వెల్లుల్లి రెబ్బలను పేస్ట్ చేసిపెట్టుకోవాలి.  కడాయిలో నూనె వేసి అందులో జీలకర్ర, లవంగాలు, బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్కను వేగించాలి 2. ఉల్లి పేస్ట్ వేసి దానికి కారం, పసుపు, గరం మసాలాలు కలపాలి 3. స్వీట్కార్న్, బఠాణీలు వేసి దోరగా వేగించాలి 4. అందులో నానబెట్టిన రైస్ వేసి ఉడికించాలి 5. ఆఖరున సరిపడా ఉప్పు వేసుకుంటే చాలు తీపి మొక్కజొన్న పలావ్ రెడీ 6. రైతాతో, అప్పడాల కాంబినేషన్లో  ఈ పలావ్ తింటే రుచిగా ఉంటుంది.
6
['tel']
నేను బంగాళదుంప యోగర్ట్ చాలా రుచికరంగా ఉంటుంది అని విన్నాను. నాకు ఇది ఎలా చెయ్యాలో సంక్లిప్తంగా చెప్పు.
బంగాళదుంప యోగర్ట్ కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. బంగాళదుంపలు - అరకేజీ 2. పెరుగు - 200ఎంఎల్ 3. నూనె - ఒక టేబుల్స్పూన్ 4. జీలకర్ర - టీస్పూన్ 5. ఆవాలు - టీస్పూన్ 6. ఉప్పు - తగినంత 7. ఉల్లిపాయలు - రెండు 8. పైనాపిల్ ముక్కలు - కొన్ని 9. పుదీనా - కొద్దిగా 10. పచ్చిమిర్చి - రెండు 11. బ్రెడ్ముక్కలు - నాలుగు. తయారీ: 1. బంగాళదుంపలను ఉడికించాలి 2. తరువాత పొట్టు తీసి సన్నటి ముక్కలుగా కట్ చేసుకోవాలి 3. పాత్రలో బంగాళదుంపల్ని వేసి, పెరుగు పోయాలి 4. స్టవ్పై పాన్లో నూనె పోసి కాస్త వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేగించాలి 5. ఈ పోపుని బంగాళదుంపల ముక్కలపై పోయాలి 6. ఉల్లిపాయలు, పైనాపిక్ ముక్కలు వేయాలి 7. బ్రెడ్ ముక్కలు పొడిపొడిగా చేసి చల్లాలి 8. పచ్చిమిర్చి సన్నగా తరిగి వేయాలి 9. పుదీనాతో గార్నిష్ చేయాలి 10. తర్వాత ఫ్రిజ్లో పెట్టి చల్లచల్లగా సర్వ్ చేయాలి.
3
['tel']
పెరుగు కబాబ్ ఎలా తయారు చేస్తాం?
పెరుగు కబాబ్ కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. పెరుగు - 400గ్రాములు 2. పనీర్ - 100గ్రాములు 3. ఉల్లిపాయ - ఒకటి 4. అల్లం - చిన్నముక్క 5. కొత్తిమీర - ఒక కట్ట 6. బాదం పలుకులు - పది 7. ఎండుద్రాక్ష - ఐదారు 8. మిరియాల పొడి - అర టీస్పూన్ 9. యాలకుల పొడి - అర టీస్పూన్ 10. ఉప్పు - రుచికి తగినంత 11. నూనె - సరిపడా 12. మొక్కజొన్న పిండి - కొద్దిగా 13. ఓట్స్ - ఒక కప్పు. తయారీ: 1. పెరుగును సన్నటి గుడ్డలో వేసి నీళ్లు వార్చాలి 2. పాన్లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఉల్లిపాయలు వేసి వేగించి పక్కన పెట్టుకోవాలి 3. ఒక పాత్రలో పెరుగు తీసుకుని, పనీర్ ముక్కలు వేయాలి 4. ఎండు ద్రాక్ష, బాదం పలుకులు, వేగించిన ఉల్లిపాయలు వేసి కలుపుకోవాలి 5. మిరియాల పొడి, యాలకుల పొడి, ఉప్పు వేయాలి 6. ఇప్పుడు మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా చేతుల్లోకి తీసుకుని వత్తుకుంటూ మొక్కజొన్న పిండి అద్దుకోవాలి 7. తరువాత ఓట్స్ను అద్దాలి 8. పాన్లో నూనె వేసి వేడి అయ్యాక కబాబ్లను వేసి గోధుమరంగులోకి మారే వరకు వేగించాలి 9. చట్నీతో సర్వ్ చేసుకుంటే కబాబ్లు కరకరలాడుతూ రుచిగా ఉంటాయి.
6
['tel']
కాకరకాయ పెరుగు కర్రీ రెసిపీ ఏంటి?
కాకరకాయ పెరుగు కర్రీ కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. కాకరకాయలు - ఎనిమిది 2. పెరుగు - అరకప్పు 3. పసుపు - అర టీస్పూన్ 4. అల్లం పొడి - అర టీస్పూన్ 5. ధనియాల పొడి - ఒక టేబుల్స్పూన్ 6. ఉప్పు - తగినంత 7. జీలకర్ర - ఒక టీస్పూన్ 8. ఇంగువ - చిటికెడు 9. మెంతులు - అర టీస్పూన్ 10. ఆవాల నూనె - పావు కప్పు. తయారీ: 1. ముందుగా జీలకర్ర, మెంతులను వేగించాలి 2. కాకరకాయలపై గరుకుగా ఉన్న పొట్టు తీసేసి, ముక్కలను ఉప్పు వేసి బాగా కలిపి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి 3. కాకరకాయలను పిండి నీటిని తీసేస్తే చేదు పోతుంది 4. పాత్రలో పెరుగు తీసుకొని అందులో పసుపు, కారం, వేగించిన జీలకర్ర, మెంతులు, ఉప్పు, ఇంగువ వేసి కలుపుకోవాలి 5. స్టవ్పై పాన్ పెట్టి నూనె వేసి కాస్త వేడయ్యాక కాకరకాయలు వేసి కాసేపు వేగించుకుని పక్కన పెట్టాలి 6. అదే పాన్లో కాస్త నూనె వేసి పెరుగు మిశ్రమం వేయాలి 7. తరువాత కాకరకాయ ముక్కలు వేసి కలుపుకొని వేగించాలి 8. ఉడుకుతున్న సమయంలో మధ్యమధ్యలో కలియబెడితే రుచికరమైన పెరుగు కర్రీ రెడీ అవుతుంది 9. అన్నంలోకి ఈ కర్రీ రుచిగా ఉంటుంది.
7
['tel']
మొదటిసారి వంట చేసేవారికి చెప్పినట్టు నాకు పనసకాయ బిర్యాని ఎలా చెయ్యాలొ చెప్పు
పనసకాయ బిర్యాని కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసిన పదార్థాలు: 1. పచ్చి పనసకాయ ముక్కలు - అరకేజి 2. బాస్మతి బియ్యం - అరకేజి 3. ఉల్లిపాయలు - పెద్దవి 2 4. అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్ స్పూను 5. పుదీనా తరుగు - ఒక కప్పు 6. బిర్యానీ మసాలా పొడి - ఒక టేబుల్ స్పూను 7. కారం - అర టీ స్పూను 8. కొత్తిమీర తరుగు - ఒక కప్పు 9. నూనె - 4 టేబుల్ స్పూన్లు 10. నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు 11. లవంగాలు 12. యాలకులు 13. జీడిపప్పు 14. దాల్చిన చెక్క 15. బిర్యానీ ఆకు - మసాల కోసం 16. ఉప్పు - రుచికి సరిపడా 17. పచ్చిమిర్చి తరుగు - పావుకప్పు. పెరుగు - అరకప్పు. తయారుచేసే విధానం: 1. ముందుగా బాస్మతి బియ్యం 70 శాతం ఉడికించి నీరు వంచేసి ఆరబెట్టాలి 2. పనస ముక్కల్లో పసుపు, కొద్దిగా ఉప్పు వేసి తగినంత నీరు పోసి 50 శాతం కుక్కర్లో ఉడికించాలి 3. కడాయిలో నూనె వేసి సన్నగా, పొడుగ్గా తరిగిన ఉల్లి దోరగా వేగించి వేరుగా ఉంచాలి 4. అదే కడాయిలో నెయ్యి వేసి మసాల దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్టు, పనస ముక్కలు, పుదీనా తరుగు, పెరుగు, బిర్యానీ మసాలా పొడి, ఉప్పు, సగం వేగిన ఉల్లి తరుగు, కారం ఒకటి తర్వాత ఒకటి వేగిస్తూ కలపాలి 5. 5 నిమిషాల తర్వాత ముక్కలపైన ఉడికించిన అన్నం పేర్చాలి 6. ఆ పైన మళ్లీ మిగిలిన ఉల్లి తరుగు, కొత్తిమీర, పుదీనా తరుగు చల్లి మూత పెట్టి చిన్నమంటపై 15 నిమిషాలు మగ్గించాలి 7. తర్వాత పనస ముక్కలు, అన్నం కలిపి వడ్డించుకోవాలి.
4
['tel']
పనస గింజల వడలు ఎలా తయారు చేస్తారో క్లుప్తంగా ఇవ్వండి.
పనస గింజల వడలు కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసిన పదార్థాలు: 1. పనస గింజలు - 2 కప్పులు 2. బియ్యప్పిండి - ఒక కప్పు 3. పచ్చిమిర్చి - 4 4. పచ్చికొబ్బరి తురుము - ఒక కప్పు 5. ఉల్లి తరుగు - అరకప్పు 6. జీలకర్ర - ఒక టీ స్పూను 7. ఉప్పు - రుచికి సరిపడా 8. కొత్తిమీర తరుగు - పావుకప్పు 9. అల్లం తరుగు - ఒక టేబుల్ స్పూను 10. నూనె - వేగించడానికి సరిపడా. తయారుచేసే విధానం: 1. పనస గింజల పై పొట్టు తీసి కుక్కర్లో ఉడికించాలి 2. మిక్సీలో చల్లారిన పనస గింజలు, అల్లం, కొబ్బరి తురుము, పచ్చిమిర్చి వేసి పేస్టు చేసుకోవాలి 3. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసి అందులో ఉప్పు, కొత్తిమీర, ఉల్లితరుగు, బియ్యప్పిండి, జీలకర్ర వేసి బాగా కలిపి ముద్దగా చేసుకోవాలి 4. ఈ మిశ్రమాన్ని కొంత కొంత తీసుకుని వడలుగా ఒత్తి కాగిన నూనెలో దోరగా రెండువైపులా వేగించుకోవాలి 5. ఇష్టమైనవారు ఇదే మిశ్రమాన్ని పకోడీగా కూడా వేసుకోవచ్చు.
1
['tel']
కాజు పనీర్ మసాలా రెసిపీ ఏంటి?
కాజు పనీర్ మసాలా కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసిన పదార్థాలు: 1. పనీర్ - 12 క్యూబ్స్ 2. జీడిపప్పు - 2 టేబుల్ స్పూన్లు 3. జీడిపప్పు పేస్టు - పావు కప్పు 4. నూనె - 2 టేబుల్ స్పూన్లు 5. వెన్న - ఒక టీ స్పూను 6. బిర్యాని ఆకు - 1 7. లవంగాలు - 3 8. యాలకులు - 2 9. జీలకర్ర - ఒక టీ స్పూను 10. ఉప్పు - రుచికి సరిపడా 11. ఉల్లిపాయ పెద్దది - ఒకటి 12. పసుపు - అర టీస్పూను 13. అల్లం వెల్లుల్లి పేస్టు 14. కారం 15. ధనియాలపొడి - 1 టీ స్పూను చొప్పున 16. జీరాపొడి 17. గరం మసాల పొడి - పావు టీ స్పూను చొప్పున 18. టమాటా గుజ్జు - ఒకటిన్నర కప్పులు 19. క్రీమ్ - 2 టేబుల్ స్పూన్లు 20. కొత్తిమీర - అరకప్పు 21. కసూరి మేతి - ఒక టీ స్పూను. తయారుచేసే విధానం : 1. పాన్లో నూనె వేసి పనీర్, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పుల్ని విడిగా వేగించి పక్కనుంచాలి 2. ఇప్పుడు వెన్నవేసి బిర్యాని ఆకు, లవంగాలు, యాలకులు, జీలకర్ర, ఉల్లితరుగు, అల్లం వెలుల్లి పేస్టు, పసుపు, కారం, ధనియాల పొడి, జీరాపొడి, గరం మసాల, ఉప్పు ఒకటితర్వాత ఒకటి వేయాలి 3. తర్వాత టమాటా గుజ్జు కలిపి పది నిమిషాలు వేగించాలి 4. నూనె తేలిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల జీడిపుప్పు పేస్టు, క్రీమ్ వేసి కలపాలి 5. మిశ్రమం చిక్కబడ్డాక పావుకప్పు నీరుపోయాలి 6. 5 నిమిషాల తర్వాత వేగించిన పనీర్, కాజు కలపాలి 7. తర్వాత కసూరి మేతి వేసి మరోసారి కలిపి కొత్తిమీర చల్లాలి.
7
['tel']
నేను దహీ అంజీర్ కబాబ్ చాలా రుచికరంగా ఉంటుంది అని విన్నాను. నాకు ఇది ఎలా చెయ్యాలో సంక్లిప్తంగా చెప్పు.
దహీ అంజీర్ కబాబ్ కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి : 1. అంజీర్ - 100గ్రా. 2. పెరుగు - 250గ్రా. 3. పనీర్ - 400గ్రా. 4. సెనగపిండి - 150గ్రా. 5. బ్రెడ్ ముక్కలు - కొన్ని 6. అల్లం  - చిన్నముక్క 7. పచ్చిమిర్చి - నాలుగు 8. కొత్తిమీర - ఒకకట్ట 9. నెయ్యి - 200గ్రా. 10. గరంమసాలా- ఒక టీస్పూన్ 11. యాలకుల పొడి - అర టీస్పూన్ 12. జీలకర్ర పొడి - ఒక టీస్పూన్ 13. ఉప్పు - రుచికి తగినంత. తయారీ : 1. ఒక పాత్రలో పెరుగు తీసుకొని అందులో పనీర్, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, గరంమసాల, యాలకుల పొడి,  జీలకర్రపొడి, ఉప్పు వేసి బాగా కలపాలి.మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా చేతులోకి తీసుకుంటూ వేగించిన సెనగపిండి, బ్రెడ్ ముక్కలతో కలపాలి 2. చిన్న చిన్న ఉండలుగా తీసుకొని మధ్యలో అంజీర్ పెట్టి కబాబ్లుగా చేసుకోవాలి 3. ఒక పాత్రలో నూనె వేసి కాస్త వేడి అయ్యాక చిన్నమంటపై ఈ కబాబ్లను గోధుమ వర్ణంలోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి 4. పుదీనా చట్నీ కాంబినేషన్లో ఇవి బాగుంటాయి.
3
['tel']
కీరా పరాటా రెసిపీ ఏంటి?
కీరా పరాటా కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసిన పదార్థాలు: 1. కీరా దోస ముక్కలు - ఒక కప్పు 2. పచ్చిమిర్చి - 2 3. అల్లం - అరంగుళం ముక్క 4. గోధుమపిండి - ఒక కప్పు 5. శనగపిండి - రెండు టేబుల్ స్పూన్లు 6. జీలకర్ర పొడి - అర టీ స్పూను 7. వాము - అర టీ స్పూను 8. పసుపు - చిటికెడు 9. పంచదార - పావు టీ స్పూను 10. నూనె లేదా నెయ్యి - కాల్చడానికి 11. ఉప్పు - రుచికి సరిపడా 12. కొత్తిమీర + పుదీనా తరుగు - అరకప్పు. తయారుచేసే విధానం: 1. మిక్సీలో దోస ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, పుదీనా తరుగు వేసి రుబ్బుకోవాలి 2. ఒక లోతైన పాత్రలో ఈ మిశ్రమాన్ని వేసి అందులో గోధుమపిండి, ఉప్పు, శనగపిండి, వాము, జీలకర్ర పొడి, పసుపు, పంచదార బాగా కలిపి ఒక టీ స్పూను నెయ్యి వేసి ముద్దగా కలుపుకోవాలి 3. పిండి తక్కువైతే మరికొంత కలుపుకోవచ్చు 4. ఈ ముద్దని పావుగంట పక్కనుంచాలి 5. తర్వాత కొంత కొంత పిండిని తీసుకొని మీకు ఇష్టమైన ఆకారంలో పరాటాలు చేసుకుని పెనంపై నూనె లేదా నెయ్యితో రెండువైపులా దోరగా కాల్చుకోవాలి 6. ఇవి నిమ్మ/టమోటా పచ్చడితో బాగుంటాయి.
7
['tel']
కీరా దోసె ఎలా తయారు చేస్తారో క్లుప్తంగా ఇవ్వండి.
కీరా దోసె కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసిన పదార్థాలు: 1. బియ్యం - ఒక కప్పు 2. పచ్చికొబ్బరి తురుము - ఒక కప్పు 3. కీరా దోస ముక్కలు - ఒకటిన్నర కప్పులు 4. జీలకర్ర - ఒక టీ స్పూను 5. పచ్చిమిర్చి - 3 6. అల్లం - అంగుళం ముక్క 7. ఉప్పు - రుచికి సరిపడా. తయారు చేసే విధానం: 1. బియ్యాన్ని రెండు, మూడు గంటలు నానబెట్టి నీరంతా వడకట్టి మిక్సీలో వేసి కొంత మెదపాలి 2. తర్వాత అందులోనే కీరా ముక్కలు, తురిమిన పచ్చికొబ్బరి, చిదిమిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసి మెత్తగా రుబ్బుకోవాలి 3. ఈ పిండినంతా ఒక పాత్రలోకి తీసుకొని అందులో జీలకర్రతో పాటు రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి 4. ఈ మిశ్రమాన్ని పదినిమిషాలు పక్కనుంచి తర్వాత పెనంపై నూనె రాసి దోసెలుగా పోసుకుని రెండువైపులా కాల్చుకోవాలి 5. వీటికి రైతా మంచి కాంబినేషన్.
1
['tel']
కచ్చీ ఘోష్ బిర్యానీ రెసిపీ ఏంటి?
కచ్చీ ఘోష్ బిర్యానీ కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. బాస్మతి బియ్యం - ఒక కేజీ 2. మటన్ - ఒక కేజీ 3. పెరుగు - 200గ్రా 4. నిమ్మకాయలు - మూడు 5. కారం - 50గ్రా 6. ధనియాలపొడి - 50గ్రా 7. అల్లంవెల్లుల్లి పేస్టు - 50గ్రా 8. ఉప్పు - 50గ్రా 9. నూనె - 100ఎంఎల్ 10. ఉల్లిపాయలు - 200గ్రా 11. కొత్తిమీర - 15గ్రా,  పుదీనా - 15గ్రా 12. బిర్యానీ ఆకు - 5గ్రా 13. డాల్డా - 15గ్రా 14. పచ్చిమిర్చి - 100గ్రా 15. గరంమసాలా - 30గ్రా 16. నెయ్యి - 200గ్రా. తయారీ విధానం: 1. మటన్ను శుభ్రంగా కడిగి ఒక పాత్రలోకి తీసుకోవాలి 2. తరువాత అందులో నిమ్మరసం, అల్లంవెల్లుల్లి పేస్టు, గరంమసాలా, పెరుగు, కొత్తిమీర, పుదీనా, ధనియాలపొడి, నూనె, వేగించిన ఉల్లిపాయలు వేసి మారినేట్ చేసుకోవాలి 3. కనీసం రెండు, మూడు గంటలపాటు మారినేట్ చేసుకోవాలి 4. ఇప్పుడు స్టవ్పై ఒక పాత్రను పెట్టి కొన్ని నీళ్లు పోయాలి 5. తరువాత అందులో గరంమసాలా, బిర్యానీ ఆకు వేయాలి 6. నీళ్లు మరుగుతున్న సమయంలో బాస్మతి బియ్యం వేసుకోవాలి 7. బియ్యం సగం ఉడికిన తరువాత నీళ్లు వంచేసి పక్కన పెట్టుకోవాలి 8. స్టవ్పై వెడల్పాటి పాత్ర పెట్టి మారినేట్ మటన్ను లేయర్లా వేసుకోవాలి 9. తరువాత దానిపై సగం ఉడికిన బియ్యం వేయాలి 10. నెయ్యి వేసుకోవాలి 11. మూతపెట్టి ఆవిరి బయటకు పోకుండా మెత్తటి పిండితో మూయాలి 12. చిన్నమంటపై 20 నుంచి 25 నిమిషాల పాటు ఉడికించాలి 13. ఎక్స్ట్రా దమ్ కావాలనుకుంటే మూతపై నిప్పుకణికలు వేయాలి 14. స్టవ్పై నుంచి దింపిన తరువాత వేగించిన ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, జీడిపప్పు వేసి వేడి వేడిగా అందించాలి.
7
['tel']
మొదటిసారి వంట చేసేవారికి చెప్పినట్టు నాకు మటన్ హలీం ఎలా చెయ్యాలొ చెప్పు
మటన్ హలీం కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. బోన్లె్స మటన్ - 600గ్రా 2. గోధుమ రవ్వ (లావుది) - 300గ్రా 3. సెనగపప్పు - 50గ్రా 4. బియ్యం - 50గ్రా 5. నూనె - 300ఎంఎల్ 6. నెయ్యి - 300ఎంఎల్ 7. కారం - 50గ్రా 8. పసుపు - 50గ్రా 9. పచ్చిమిర్చి - 30గ్రా 10. అల్లం వెల్లుల్లి పేస్టు - 30గ్రా 11. మిరియాల పొడి - 10గ్రా 12. నిమ్మకాయలు - మూడు 13. యాలకులు - 50గ్రా 14. గరంమసాలా - 50గ్రా 15. ఉల్లిపాయలు - 200గ్రా 16. పెరుగు - 100గ్రా 17. పుదీనా - 50గ్రా 18. తమలపాకు వేర్లు (పాన్ కి జాద్) - 30గ్రా 19. ఖాస్ కి జాద్ - 30గ్రా. తయారీ విధానం: 1. మటన్ను శుభ్రంగా కడిగి ఒక పాత్రలోకి తీసుకోవాలి 2. తరువాత అందులో ఖాస్ కి జాద్, పాన్ కి జాద్ వేసి, తగినన్ని నీళ్లు పోసి 20 నుంచి 25 నిమిషాల పాటు ఉడికించాలి 3. గోధుమరవ్వ, సెనగపప్పు, బియ్యంను అరగంటపాటు నానబెట్టాలి 4. తరువాత నీళ్లు తీసేసి మిక్సీలో వేసి మెత్తటి పేస్టులా పట్టుకోవాలి 5. స్టవ్పై మందంగా ఉండే పాన్ పెట్టి నూనె వేసి ఉల్లిపాయలు గోధుమ రంగులోకి మారే వరకు వేగించాలి 6. ఇందులో నుంచి గార్నిష్ కోసం కొన్ని పక్కన పెట్టుకోవాలి 7. తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి పేస్టు, పెరుగు, పసుపు, కారం, గోధుమరవ్వ-సెనగపప్పు-బియ్యం పేస్టు వేసి కలపాలి 8. ఈ మిశ్రమం వేగిన తరువాత మటన్ వేయాలి 9. మటన్ ముక్కలకు మసాలా బాగా పట్టేలా కలియబెట్టాలి 10. నిమ్మరసం, మిరియాల పొడి, యాలకులపొడి, గరంమసాలా వేయాలి 11. పైన నెయ్యి వేసుకోవాలి 12. వేగించి పెట్టుకున్న ఉల్లిపాయలు, పుదీనా ఆకులతో అలంకరించి వడ్డించాలి.
4
['tel']
నేను టిక్కా చాలా రుచికరంగా ఉంటుంది అని విన్నాను. నాకు ఇది ఎలా చెయ్యాలో సంక్లిప్తంగా చెప్పు.
టిక్కా కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. చేప ముక్కలు - అరకిలో 2. పెరుగు - ఒక కప్పు 3. కారం - ఒకటిన్నర టీస్పూన్ 4. మిరియాల పొడి - అర టీస్పూన్ 5. అల్లంవెల్లుల్లి పేస్టు - ఒకటిన్నర టీస్పూన్ 6. పసుపు - చిటికెడు 7. మెంతి ఆకుల పొడి- అర టేబుల్స్పూన్ 8. నిమ్మరసం - రెండు టేబుల్స్పూన్లు 9. గరంమసాల - అర టీస్పూన్ 10. ధనియాల పొడి - అర టీస్పూన్ 11. ఉప్పు - రుచికి తగినంత 12. నూనె - సరిపడా 13. శనగపిండి - ఒకటిన్నర టేబుల్స్పూన్ 14. టొమాటో - ఒకటి 15. ఉల్లిపాయ - ఒకటి. తయారీ విధానం: 1. పెరుగు చిక్కగా ఉండాలి 2. ఒకవేళ పెరుగులో నీళ్లుంటే ముస్లిన్ క్లాత్ సహాయంతో పిండి నీళ్లు తీసేయాలి 3. తరువాత అందులో శనగపిండి, తగినంత ఉప్పు, మిరియాల పొడి, కారం, నిమ్మరసం, అల్లంవెల్లుల్లి పేస్టు, పసుపు, కసూరి మేతి, గరంమసాల, ధనియాల పొడి కలుపుకోవాలి 4. కొద్దిగా నూనె వేసి కలుపుకొంటే మసాలా మిశ్రమం బాగుంటుంది 5. ఇప్పుడు శుభ్రంగా కడిగిన చేప ముక్కలను వేసి మసాలా ముక్కలకు పట్టేలా కలియబెట్టుకోవాలి 6. ఓవెన్ను 240 డిగ్రీల సెంటీగ్రేడ్కు ప్రీ హీట్ చేసుకోవాలి 7. చేప ముక్కలను ట్రేలో పెట్టి ఓవెన్లో పదినిమిషాలు బేక్ చేసుకోవాలి 8. తరువాత హీట్ను 180 డిగ్రీలకు తగ్గించుకుని మరో పదినిమిషాలు బేక్ చేయాలి 9. ఓవెన్ లేని వారు నిప్పు కణికలపై గ్రిల్ జాలీ పెట్టి కాల్చుకోవచ్చు 10. టొమాటో, ఉల్లిపాయలను గుండ్రంగా తరిగి గార్నిష్ చేసుకుని ఫిష్ టిక్కా సర్వ్ చేసుకోవాలి.
3
['tel']
మంచూరియా ఎలా చేయాలి? సమాధానం లో కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఉండాలి.
మంచూరియా కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. చేప ముక్కలు - పావుకిలో 2. నూనె - సరిపడా 3. కార్న్స్టార్చ్ - ఒకటిన్నర టేబుల్స్పూన్ 4. మైదా - ఒకటిన్నర టేబుల్స్పూన్ 5. ఉప్పు - రుచికి తగినంత 6. సోయాసాస్ - ఒకటిన్నర టేబుల్స్పూన్ 7. మిరియాల పొడి - పావు టీస్పూన్ 8. అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్ 9. వెల్లుల్లి రెబ్బలు - మూడు 10. ఉల్లిపాయ - ఒకటి 11. గ్రీన్ క్యాప్సికం - ఒకటి 12. రెడ్ క్యాప్సికం - ఒకటి 13. వెనిగర్ - ఒక టీస్పూన్ 14. రెడ్ చిల్లీ సాస్ - ఒక టేబుల్స్పూన్ 15. పంచదార - ఒక టీస్పూన్ 16. నీళ్లు - రెండు టేబుల్స్పూన్లు. తయారీ విధానం: 1. ఒక బౌల్లో టేబుల్స్పూన్ సోయాసాస్ తీసుకుని అందులో రెడ్ చిల్లీసాస్, పంచదార, వెనిగర్ వేసి సాస్ రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి 2. చేప ముక్కలను శుభ్రంగా కడిగి వాటిపై మిగిలిన సోయాసాస్, అల్లంవెల్లుల్లి పేస్టు, మిరియాల పొడి వేసి కలుపుకొని పదినిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి 3. తరువాత ఆ ముక్కలపై కార్న్ స్టార్చ్, మైదా, తగినంత ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు చిలకరించి కలుపుకోవాలి 4. చేప ముక్కలకు ఈ మిశ్రమం లేయర్లా పట్టేలా కలపాలి 5. స్టవ్పై పాన్పెట్టి నూనె వేసి వేడి అయ్యాక చేప ముక్కలు వేసి వేగించుకోవాలి 6. స్టవ్పై మరొక పాన్ పెట్టి రెండు టేబుల్స్పూన్ల నూనె వేసి వేడి అయ్యాక వెల్లుల్లి రెబ్బలు వేయాలి 7. క్యాప్సికం ముక్కలు, ఉల్లిపాయలు వేయాలి 8. తరువాత రెడీ చేసి పెట్టుకున్న సాస్ వేసి కలియబెట్టాలి 9. కొద్దిగా నీళ్లు పోయాలి 10. సాస్ ఉడుకుతున్న సమయంలో వేగించి పెట్టుకున్న చేప ముక్కలు వేయాలి 11. రెండు నిమిషాల పాటు ఉడికించుకుని దింపుకోవాలి 12. ఉల్లిపాయలతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి.
5
['tel']
ఫిష్ కేక్ ఎలా చేయాలి? సమాధానం లో కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఉండాలి.
ఫిష్ కేక్ కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. చేప ముక్కలు - ఐదారు. ఉప్పు - రుచికి తగినంత 2. బంగాళదుంపలు - రెండు 3. మిరియాల పొడి - అర టీస్పూన్ 4. నిమ్మరసం - మూడు టేబుల్స్పూన్లు 5. కొత్తిమీర - ఒక కట్ట 6. పచ్చిమిర్చి - రెండు 7. బ్రెడ్ ముక్కలు - అరకప్పు 8. నూనె - ఒక టీస్పూన్ 9. ఉల్లిపాయ - ఒకటి. తయారీ విధానం: 1. చేప ముక్కలను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి 2. బంగాళదుంపలను ఉడికించి, పొట్టు తీసి గుజ్జుగా  చేసుకోవాలి 3. ఇప్పుడు చేప ముక్కల్లో పచ్చిమిర్చి, తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, బంగాళదుంప గుజ్జు వేసి కలపాలి 4. నిమ్మరసం, తగినంత ఉప్పు, మిరియాల పొడి కూడా వేసుకోవాలి 5. తరువాత మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న కేకుల మాదిరిగా చేసుకోవాలి 6. ఒక ప్లేట్లో బ్రెడ్ ముక్కలు తీసుకుని ముక్కలకు అద్దాలి 7. బేకింగ్ ట్రేకు నూనె రాసి ఫిష్ కేక్లను పెట్టాలి 8. ఓవెన్ను 200 డిగ్రీల సెంటీగ్రేడ్కు ప్రీ హీట్ చేసుకోవాలి 9. తరువాత బేకింగ్ ట్రేను పావుగంట పాటు ఓవెన్లో పెట్టి బేక్ చేసుకోవాలి 10. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి.
5
['tel']
ఫింగర్స్ ఎలా తయారు చేస్తాం?
ఫింగర్స్ కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. చేపలు - పావుకిలో 2. నిమ్మకాయ - ఒకటి 3. ఉప్పు - రుచికి తగినంత 4. మిరియాల పొడి - అర టీస్పూన్ 5. మైదా పిండి - ఒకటిన్నర టేబుల్స్పూన్ 6. శనగపిండి - అర టేబుల్స్పూన్ 7. కోడిగుడ్లు - రెండు 8. బ్రెడ్ ముక్కలు - అరకప్పు 9. జీలకర్ర - ఒక టీస్పూన్ 10. ఆవాలు 11. ఒక టీస్పూన్ 12. మెంతులు - అరటీస్పూన్ 13. కారం - ఒక టీస్పూన్ 14. అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్ 15. నూనె - సరిపడా. తయారీ: 1. జీలకర్ర, ఆవాలు, మెంతులను మిక్సీలో వేసి పొడి చేసి ఒక పాత్రలోకి తీసుకోవాలి 2. అందులో మైదా, శనగపిండి, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, మిరియాలపొడి, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి 3. తరువాత కోడిగుడ్ల తెల్లసొన వేసి కలియబెట్టాలి 4. చేపలను నిలువుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి 5. చేప ముక్కలను పిండి మిశ్రమంలో వేసి ముక్కలకు బాగా పట్టేలా కలిపి మారినేట్ చేసుకోవాలి 6. ఒక పాన్లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక మారినేట్ చేసిన చేప ముక్కలకు బ్రెడ్ క్రంబ్స్ అద్ది వేగించాలి 7. వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి.
6
['tel']
కట్లెట్స్ ఎలా తయారు చేస్తారో క్లుప్తంగా ఇవ్వండి.
కట్లెట్స్ కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. రవ్వ చేపలు - అరకిలో 2. అల్లం ముక్కలు - అర అంగుళం ముక్కలు రెండు 3. పచ్చిమిర్చి - నాలుగు 4. వెల్లుల్లి రెబ్బలు - మూడు 5. బ్రెడ్ ముక్కలు - 100గ్రా. 6. కోడిగుడ్డు - ఒకటి,  పుదీనా - ఒకకట్ట 7. ఉప్పు - రుచికి తగినంత 8. పసుపు - ఒక టీస్పూన్ 9. కారం - ఒక టీస్పూన్ 10. సోంపు - ఒక టీస్పూన్ 11. మిరియాలు - నాలుగైదు 12. నూనె - సరిపడా 13. నిమ్మరసం - అర టీస్పూన్ 14. బంగాళదుంప - ఒకటి 15. మైదా - రెండు టేబుల్స్పూన్లు. తయారీ: 1. స్టవ్పై ఒక పాత్రను పెట్టి నీళ్లు పోసి అల్లం ముక్క, ఒక వెల్లుల్లి రెబ్బ, రెండు పచ్చిమిర్చి వేసి మరిగించాలి 2. ఆ పాత్రలో ఆవిరి పాత్రపెట్టి చేప ముక్కలను ఆవిరిపై ఉడికించాలి 3. బ్రెడ్ ముక్కలు, కోడిగుడ్డు, అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు, మిగిలిన పచ్చిమిర్చి, పుదీనా, తగినంత ఉప్పు, పసుపు, కారం వేసి బ్లెండర్లో బాగా కలుపుకోవాలి 4. తరువాత మిరియాలు, సోంపు బాగా దంచి వేయాలి 5. ఇప్పుడు ఆవిరిపై ఉడికించిన చేప ముక్కలు వేసి మరొక్కసారి గ్రైండ్ చేయాలి 6. ఈ మిశ్రమాన్ని ఒక పాత్రలోకి తీసుకోవాలి 7. బంగాళదుంపను ఉడికించి గుజ్జుగా చేసి వేయాలి 8. మిశ్రమాన్ని బాగా కలపాలి 9. ఇప్పుడు కట్లెట్ల మాదిరిగా చేసుకుంటూ పొడి పిండి అద్దాలి 10. తరువాత పది నిమిషాల పాటు ఫ్రిజ్లో పెట్టాలి 11. ఒక పాన్లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక కట్లెట్లు వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి 12. పుదీనాతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి.
1
['tel']
చిన్న చేపల వేపుడు ఎలా చేయాలి? సమాధానం లో కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఉండాలి.
చిన్న చేపల వేపుడు కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. చేపలు చిన్నవి - పదిహేను 2. కారం - రెండు టేబుల్స్పూన్లు 3. ధనియాలపొడి - ఒక టీస్పూన్ 4. జీలకర్ర పొడి - ఒక టీస్పూన్ 5. పసుపు - పావు టీస్పూన్ 6. అల్లంవెల్లుల్లి పేస్టు - మూడు టీస్పూన్లు 7. మొక్కజొన్న పిండి - ఒక టేబుల్స్పూన్ 8. బియ్యప్పిండి - ఒక టేబుల్స్పూన్ 9. నిమ్మరసం - ఒక టేబుల్స్పూన్ 10. ఉప్పు - రుచికి తగినంత 11. ఉల్లిపాయ - ఒకటి 12. కరివేపాకు - కొద్దిగా. తయారీ విధానం: 1. ముందుగా చేపలను ఉప్పు వేసి శుభ్రంగా కడగాలి 2. తరువాత కారం, ధనియాల పొడి, జీలకర్రపొడి, పసుపు, అల్లంవెల్లుల్లి పేస్టు, నిమ్మరసం వేసి కలపాలి 3. తరువాత మొక్కజొన్న పిండి, బియ్యప్పిండి వేసి, తగినంత ఉప్పు వేసి కలుపుకొని పదినిమిషాలు మారినేట్ చేసుకోవాలి 4. స్టవ్పై పాన్ పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక మారినేట్ చేసిన చేపలు వేసి వేగించుకుంటూ పక్కన పెట్టుకోవాలి 5. మరొకపాన్లో కొద్దిగా నూనె వేసి కరివేపాకు, ఉల్లిపాయలు వేసి వేగించి తీసుకోవాలి 6. వీటితో గార్నిష్ చేసుకుని చేపల వేపుడును సర్వ్ చేసుకోవాలి.
5
['tel']
భార్వా ముర్గ్ లెగ్ ఎలా తయారు చేస్తాం?
భార్వా ముర్గ్ లెగ్ కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. చికెన్ డ్రమ్స్టిక్స్ - ఎనిమిది 2. చికెన్ - 150గ్రా 3. ఉల్లిపాయ - ఒకటి 4. అల్లంవెల్లుల్లి పేస్టు - రెండు టేబుల్స్పూన్లు 5. కారం - అర టీస్పూన్ 6. పచ్చిమిర్చి - రెండు 7. కొత్తిమీర - కొద్దిగా 8. నిమ్మరసం - ఒక టేబుల్స్పూన్ 9. కార్న్స్టార్చ్ - తగినంత 10. బ్రెడ్క్రంబ్స్ - తగినంత 11. నూనె - డీప్ ఫ్రైకి సరిపడా 12. ఉప్పు - రుచికి తగినంత 13. ఉల్లిపాయ - ఒకటి (గార్నిష్ కోసం). తయారీ విధానం: 1. చికెన్ డ్రమ్స్టిక్స్ను అల్లంవెల్లుల్లి పేస్టు, కొద్దిగా ఉప్పు వేసి రెండు గంటల పాటు మారినేట్ చేసుకోవాలి 2. స్టఫ్ఫింగ్ కోసం ఒక పాన్లో చికెన్ వేసి కారం, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు వేసి ఉడికించాలి 3. చికెన్లో పూర్తిగా నీరు పోయే వరకు ఫ్రై చేయాలి 4. తరువాత నిమ్మరసం వేసి పక్కన పెట్టుకోవాలి.చికెన్ డ్రమ్స్టిక్లను స్టఫ్తో నింపి కార్న్స్టార్చ్ అద్దుతూ బ్రెడ్క్రంబ్స్పై రోల్ చేయాలి 5. స్టవ్పై పాన్ పెట్టి నూనెలో డీప్ ఫ్రై చేయాలి 6. ఉల్లిపాయలతో గార్నిష్ చేసి పుదీనా చట్నీతో సర్వ్ చేసుకోవాలి.
6
['tel']
నర్గీసి కబాబ్ కా కుర్మా ఎలా చేయాలి? సమాధానం లో కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఉండాలి.
నర్గీసి కబాబ్ కా కుర్మా కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. కోడిగుడ్లు - ఆరు 2. బోన్లె్స మటన్ - 200గ్రా 3. ఉల్లిపాయ - ఒకటి 4. అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్స్పూన్ 5. కారం - ఒక టీస్పూన్ 6. పసుపు - పావు టీస్పూన్ 7. పెరుగు - అరకప్పు 8. శనగలు - ఒక టేబుల్స్పూన్ 9. నూనె - సరిపడా 10. ఉప్పు - రుచికి తగినంత 11. ఖుస్ఖుస్ - ఒక టేబుల్స్పూన్ 12. పుచ్చకాయ విత్తనాలు - ఒక టేబుల్స్పూన్ 13. కొత్తిమీర - కొద్దిగా. తయారీ విధానం: 1. కోడిగుడ్లు ఉడికించి పొట్టు తీసి పెట్టుకోవాలి 2. మటన్ను కుక్కర్లో వేసి, కారం, అల్లంవెల్లుల్లి పేస్టు, కొద్దిగా ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి 3. తరువాత మెత్తటి పేస్టులా చేసుకోవాలి 4. శనగలను వేగించి పొడి చేసుకోవాలి 5. ఈ పొడిని మటన్ పేస్టులో కలుపుకోవాలి 6. ఈ మిశ్రమాన్ని ఆరు భాగాలుగా చేసుకోవాలి 7. ఒక్కో కోడిగుడ్డును తీసుకుని చుట్టూ మటన్ పేస్టును పెట్టాలి 8. స్టవ్పై నూనె పెట్టి వేడి అయ్యాక నూనెలో వేసి ముదురు గోధుమరంగులోకి మారే వరకు వేగించాలి 9. ఖుస్ఖుస్, పుచ్చకాయ విత్తనాలను వేగించి పొడి చేసుకోవాలి 10. గ్రేవీ కోసం స్టవ్పై మరో పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక ఉల్లిపాయలు వేసి వేగించాలి 11. తరువాత అల్లంవెల్లుల్లి పేస్టు, కారం, పసుపు, తగినంత ఉప్పు వేసి కలియబెట్టాలి 12. ఇప్పుడు పుచ్చకాయ విత్తనాల పొడి వేయాలి 13. కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి 14. ఇప్పుడు పెరుగు వేయాలి 15. కాసేపయ్యాక ఒక కప్పు నీళ్లు పోయాలి 16. గ్రేవీ చిక్కగా అయ్యే వరకు ఉడికించాలి 17. చివరగా కబాబ్లను మధ్యలో కట్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి 18. వాటిపైన గ్రేవీ పోయాలి 19. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని చపాతీ లేక అన్నంతో సర్వ్ చేసుకోవాలి.
5
['tel']
మీరు కోఫ్తా ఔర్ దహీ కి కాడీ తయారు చెయ్యడానికి ఎటువంటి తిండి పదార్ధాలు వాడుతురు మరియు ఏ విధముగా చేస్తారో వివరణ ఇవ్వండి.
కోఫ్తా ఔర్ దహీ కి కాడీ కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. మాంసం - పావుకేజీ 2. పెరుగు - అరకేజీ 3. శనగపిండి - నాలుగైదు టేబుల్స్పూన్లు 4. ఆవాలు 5. జీలకర్ర - ఒక టీస్పూన్ 6. కరివేపాకు - కొద్దిగా 7. అల్లం - అర అంగుళం ముక్కలు ఎనిమిది 8. పచ్చిమిర్చి - రెండు 9. ఎండుమిర్చి - నాలుగైదు 10. పసుపు - అర టీస్పూన్ 11. నూనె - సరిపడా 12. కొత్తిమీర - ఒక కట్ట 13. ఉప్పు - తగినంత. తయారీ విధానం: 1. మీట్ బాల్స్ తయారుచేసుకోవడం కోసం మాంసంలో ఒక టేబుల్స్పూన్ శనగపిండి, కొద్దిగా కారం, తగినంత ఉప్పు వేసి మిక్సీలో మెత్తటి పేస్టులా తయారుచేసుకోవాలి 2. ఈ మిశ్రమంతో నిమ్మకాయ సైజులో చిన్న బాల్స్లా చేసుకోవాలి 3. తరువాత నూనెలో వేగించి పక్కన పెట్టుకోవాలి 4. ఒక బౌల్లో పెరుగు తీసుకుని అందులో మిగిలిన శనగపిండి, కారం, పసుపు, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి 5. స్టవ్పై పాన్ పెట్టి నూనె పోసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేగించాలి 6. తరువాత పెరుగు మిశ్రమం వేసి కలుపుతూ ఉండాలి 7. అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకోవాలి 8. మిశ్రమం కొద్దిగా చిక్కగా అయ్యే వరకు ఉడికించాలి 9. చివరగా వేగించిన పెట్టుకున్న మీట్ బాల్స్ వేసి దింపుకోవాలి 10. అన్నంతో సర్వ్ చేసుకోవాలి.
2
['tel']
చక్నా రెసిపీ ఏంటి?
చక్నా కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. గొర్రె మాంసం - 200గ్రా (ల్యాంబ్ చాప్స్) 2. గొర్రె కిడ్నీలు - 100గ్రా 3. గొర్రె కాలేయం - 100గ్రా 4. గొర్రె నాలుక - రెండు 5. బోన్లెస్ చికెన్ - 200గ్రా 6. ఉల్లిపాయలు - రెండు 7. అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్స్పూన్ 8. కారం - ఒక టీస్పూన్ 9. పసుపు - అర టీస్పూన్ 10. పచ్చిమిర్చి - మూడు 11. కొత్తిమీర - కొద్దిగా 12. శనగలు - రెండు టేబుల్స్పూన్లు 13. నిమ్మరసం - రెండు టేబుల్స్పూన్లు 14. పెరుగు - అర కప్పు 15. నూనె - అర కప్పు 16. ఉప్పు - రుచికి తగినంత. తయారీ విధానం: 1. ముందుగా గొర్రె మాంసం ఉడికించుకోవాలి 2. కిడ్నీలను రెండు ముక్కలుగా కట్ చేయాలి 3. కాలేయంను చిన్న చిన్నముక్కలుగా కట్  చేసుకోవాలి 4. నాలుకను ఉడికించి రెండు ముక్కలుగా చేసుకోవాలి 5. శనగలను నెయ్యిలో వేగించి పొడి చేసుకోవాలి 6. స్టవ్పై పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయలు వేగించాలి 7. తరువాత అందులో నుంచి కొన్ని ఉల్లిపాయలు తీసి పక్కన పెట్టాలి 8. మిగతా ఉల్లిపాయల్లో అల్లం వెల్లుల్లి పేస్టు వేసి మరికాసేపు వేగించాలి 9. తరువాత కారం, పసుపు, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి 10. ఇప్పుడు కాలేయం, కిడ్నీలు వేసి కలుపుకోవాలి 11. కాసేపు వేగాక పెరుగు వేయాలి 12. నూనె తేలేవరకు ఉడికించాలి 13. తరువాత చికెన్ వేసి రెండు కప్పుల నీళ్లు పోసి మరికాసేపు ఉడికించుకోవాలి 14. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న మాంసం, నాలుక వేసి కలుపుకోవాలి 15. శనగపిండిలో కొద్దిగా నీళ్లు పోసి పలుచగా చేయాలి 16. తరువాత గ్రేవీలో పోసి కలుపుకోవాలి 17. నిమ్మరసం వేయాలి 18. నూనె పైకి తేలే వరకు ఉడికించాలి 19. చివరగా కొత్తిమీర, వేగించిన ఉల్లిపాయలతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి.
7
['tel']
రొయ్యలు క్రిస్పీగా.. రెసిపీ ఏంటి?
రొయ్యలు క్రిస్పీగా.. కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. రొయ్యలు - అరకేజీ 2. కార్న్స్టార్చ్ - అరకప్పు 3. ఉప్పు - తగినంత 4. మిరియాల పొడి - అర టీస్పూన్ 5. ఎగ్వైట్స్ - మూడు 6. కొబ్బరి తురుము - రెండు కప్పులు 7. నూనె - సరిపడా 8. స్వీట్ రెడ్ చిల్లీ సాస్ - కొద్దిగా 9. పంచదార - రెండున్నర టేబుల్స్పూన్లు. తయారీ విధానం: 1. ఒక పాత్రలో కార్న్స్టార్చ్, మిరియాల పొడి, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి 2. తరువాత అందులో రొయ్యలు వేసి మరోసారి కలిపి పక్కన పెట్టాలి 3. మరొక పాత్రలో ఎగ్వైట్స్  తీసుకోవాలి 4. ఇంకో పాత్రలో కొబ్బరి తురుము, పంచదార వేసి కలియబెట్టాలి 5. ఇప్పుడు రొయ్యలు ఒక్కోటి తీసుకుంటూ ఎగ్వైట్లో డిప్ చేస్తూ కొబ్బరి తురుము అద్దాలి 6. వీటిని బేకింగ్ షీట్లో పెట్టి పైన కవర్ వేసి ఫ్రిజ్లో పెట్టాలి 7. స్టవ్పై పాన్ పెట్టి నూనె పోయాలి 8. నూనె వేడి అయ్యాక రొయ్యలు వేసి వేగించాలి 9. ఈ క్రిస్పీ రెసిపీ రెడ్ చిల్లీ సాస్తో తింటే రుచిగా ఉంటుంది.
7
['tel']
ఎగ్ప్లాంట్ స్టీక్స్ రెసిపీ ఏంటి?
ఎగ్ప్లాంట్ స్టీక్స్ కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. వంకాయలు - నాలుగు 2. కాబూళి సెనగలు - అరకప్పు 3. క్యాప్సికం - మూడు(ఎరుపు 4. పసుపు 5. ఆకుపచ్చ) 6. జున్ను - అరకప్పు 7. కొత్తిమీర - ఒకకట్ట 8. ఉప్పు - రుచికి తగినంత 9. మిరియాల పొడి - ఒకటిన్నర టీస్పూన్ 10. ఆలివ్ ఆయిల్ - ఒకటిన్నర టేబుల్స్పూన్ 11. టొమాటో కెచప్ - మూడు టేబుల్స్పూన్లు. తయారీ విధానం: 1. వంకాయలను పొడవు ముక్కలుగా కట్ చేసుకోవాలి 2. కాబూళి సెనగలను ముందు రోజు రాత్రి నానబెట్టుకొని, మెత్తగా అయ్యే వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి 3. క్యాప్పికంను కట్ చేసి కాస్త వేగించి పక్కన పెట్టాలి 4. ఒక ప్లేట్లో ఉప్పు, మిరియాల పొడి వేసి వంకాయ ముక్కలు రబ్ చేసి పావు గంట పాటు పక్కన పెట్టుకోవాలి 5. గ్రిల్ పాన్ను వేడి చేసి కొద్దిగా నూనె చిలకరించాలి 6. తరువాత వంకాయ ముక్కలను రెండు వైపులా కాల్చాలి 7. ఇప్పుడు ఆ ముక్కలకు టోమాటో సాస్ రాసి, సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి 8. ఉడికించిన కాబూళి సెనగలు, క్యాప్సికం ముక్కలు సమంగా పరచాలి 9. కొద్దిగా సాస్ పోయాలి 10. జున్ను, కొత్తిమీరతో గార్నిష్ చేయాలి 11. వీటిని చల్లగా లేదా వేడిగా సర్వ్ చేసుకోవచ్చు.
7
['tel']
స్వీడిష్ మీట్ బాల్స్ ఎలా తయారు చేస్తారో క్లుప్తంగా ఇవ్వండి.
స్వీడిష్ మీట్ బాల్స్ కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. కోడిగుడ్లు - రెండు 2. బోన్లెస్ మటన్ - పావుకేజీ 3. క్రీమ్ - అరకప్పు 4. వైట్ శాండ్విచ్ బ్రెడ్ - ఒకటిన్నరకప్పు 5. వెల్లుల్లి రెబ్బలు - రెండు 6. మిరియాల పొడి - పావు టీస్పూన్ 7. ఉప్పు - ఒకటిన్నర టీస్పూన్ 8. బేకింగ్ పౌడర్ - రెండు టీస్పూన్లు. తయారీ విధానం: 1. ముందుగా ఓవెన్ను 325 డిగ్రీల ఫారన్హీట్కు  వేడి చేసుకోవాలి 2. ఒక బౌల్లో కోడిగుడ్లు కొట్టి వేయాలి 3. అందులో క్రీమ్, శాండ్విచ్ బ్రెడ్ ముక్కలు వేసి కలపాలి 4. మాంసం, వెల్లుల్లి రెబ్బలు, మిరియాలను మిక్సీలో వేసి, తగినంత ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి 5. మిశ్రమం మరీ పలుచగా కాకూడదు 6. గట్టిగానూ ఉండకూడదు 7. ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ బేకింగ్ షీట్లో వేసి 20 నిమిషాల పాటు ఓవెన్లో బేక్ చేయాలి 8. మీట్ బాల్స్ ఉడుకుతున్న సమయంలో సాస్ తయారుచేసుకోవాలి 9. వెడల్పాటి పాన్ స్టవ్పై పెట్టి వెన్న వేసి వేడి చేయాలి 10. తరువాత అందులో చికెన్ బ్రాత్ పోయాలి 11. కాసేపయ్యాక బ్రౌన్ షుగర్ వేసి కలపాలి 12. పదినిమిషాల పాటు ఉడికించుకుంటే సాస్ చిక్కగా అవుతుంది 13. ఇప్పుడు క్రీమ్, సోయా సాస్, మిరియాల పొడి వేసి మరి కాసేపు ఉడికించాలి 14. తరువాత ఓవెన్లో ఉడికించి పెట్టుకున్న మీట్ బాల్స్ వేయాలి 15. కాసేపు ఉడికిన తరువాత నిమ్మరసం పిండుకోవాలి 16. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని దింపాలి 17. వేడివేడిగా సర్వ్ చేయాలి.
1
['tel']
దమ్ కీ నల్లీ ఎలా తయారు చేస్తాం?
దమ్ కీ నల్లీ కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. వంటనూనె - 50 మి.లీ 2. ఉల్లిపాయలు- అరకేజీ 3. యాలకులు - 4 గ్రా 4. లవంగాలు  నాలుగు గ్రా 5. బిర్యానీ ఆకు - 4గ్రా 6. సా జీరా- 4గ్రా 7. దాల్చిన చెక్క- 2 గ్రా 8. నల్లీ- ఒక కిలో 9. అల్లం వెల్లుల్లి పేస్ట్- 100గ్రా 10. కారం - 100 గ్రా 11. గరం మసాలా పొడి- 20 గ్రా 12. కుంకుమ పువ్వు- 1 గ్రా 13. టొమాటో ప్యూరీ - 350 గ్రా 14. మటన్ బోన్స్- రెండు కిలోలు 15. ఉప్పు- తగినంత. తయారీ విధానం: 1. ముందుగా ఓ కడాయిలో 2కేజీల మటన్ బోన్స్ను 2.5 లీటర్ల నీటిలో వేసి 1.5 లీటర్ల బోన్స్టాక్ వచ్చే వరకూ ఉడికించి,  ఆ నీటిని వేరే పాత్రలో తీసుకుని పక్కన పెట్టుకోవాలి 2. ఇప్పుడు మరో పాత్రలో నూనె, నెయ్యి వేిసి వేడి చేయాలి 3. దీనిలో దాల్చినచెక్క, యాలకులు వేసి వేయించాలి 4. అనంతరం ఉల్లిపాయలు వేసి గోధుమ రంగు వచ్చే వరకూ వేయించాలి 5. తరువాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలిపి గోధుమ రంగు వచ్చే వరకూ వేయించిన తరువాత లవంగాలు, బిర్యానీ ఆకు, సాజీరా కలిపి ఓ నిమిషం ఉడికించాలి 6. ఇప్పుడు నల్లి జోడించి దానిలో తేమ పోయేంత వరకూ ఉంచి అనంతరం టొమాటో ప్యూరీ కలపాలి 7. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న బోన్స్టాక్ను వేసి ఓ సారి పూర్తిగా మరిగించి, ఆ తరువాత సిమ్లో నల్లి బాగా ఉడికేంత వరకూ ఉడికించాలి 8. ఆ తరువాత నల్లీ బయటకు తీసి, గ్రేవీ చిక్కగా అయ్యేంత వరకూ ఉంచాలి 9. ఉప్పు తగినంత వేసు కోవాలి 10. ఇప్పుడు గ్రేవీలో మరలా నల్లీ జోడించాలి 11. అనంతరం గరంమసాలా, కుంకుమ పువ్వు తో అలంకరించుకుని, జీరా రైస్తో సర్వ్ చేసుకోవాలి.
6
['tel']
మీరు ప్రాన్స్ టిక్కా మసాలా తయారు చెయ్యడానికి ఎటువంటి తిండి పదార్ధాలు వాడుతురు మరియు ఏ విధముగా చేస్తారో వివరణ ఇవ్వండి.
ప్రాన్స్ టిక్కా మసాలా కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. ప్రాన్స్ - 10 (రొయ్యలు పెద్ద సైజులో ఉన్నవి తీసుకోవాలి) 2. నిమ్మరసం - అర టీస్పూన్ 3. కారం - ఒక టేబుల్స్పూన్ 4. ఉప్పు - తగినంత 5. అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్స్పూన్ 6. పెరుగు - అరకప్పు 7. క్రీమ్ - పావు కప్పు 8. ఉల్లిపాయలు - రెండు 9. టొమాటో ప్యూరీ - అరకప్పు 10. కశ్మీరీ కారం - ఒక టేబుల్స్పూన్ 11. ఉప్పు - రుచికి తగినంత 12. పసుపు - ఒక టీస్పూన్ 13. జీలకర్ర - ఒక టీస్పూన్ 14. గరంమసాల - ఒక టేబుల్స్పూన్ 15. వెన్న - ఒక టేబుల్స్పూన్ 16. నూనె - సరిపడా 17. కొత్తిమీర - ఒకకట్ట. తయారీ విధానం: 1. ఒక పాత్రలో శుభ్రంగా కడిగిన ప్రాన్స్ తీసుకోవాలి 2. అందులో నిమ్మరసం, కారం, అల్లంవెల్లుల్లి పేస్టు, తగినంత ఉప్పు వేసి కలుపుకొని పావు గంట పాటు పక్కన పెట్టుకోవాలి 3. స్టవ్పై ఒక మందపాటి పాన్ తీసుకుని వెన్న వేసి వేడి చేయాలి 4. తరువాత రొయ్యలు వేసి చిన్నమంటపై నాలుగైదు నిమిషాలు వేగించి మరో పాత్రలోకి  తీసుకుని పక్కన పెట్టాలి 5. అదే పాన్లో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక జీలకర్ర వేసి వేగించాలి 6. తరిగిన ఉల్లిపాయలు వేసి మరికాసేపు వేగించుకోవాలి 7. అల్లంవెల్లుల్లి పేస్టు వేయాలి 8. కారం, పసుపు, కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి 9. ఇప్పుడు టొమాటో ప్యూరీ వేసి చిన్నమంటపై మరో నాలుగు నిమిషాలు ఉడికించాలి 10. తరువాత మిశ్రమం చిక్కబడుతున్న సమయంలో క్రీమ్, పెరుగు, గరంమసాల వేసి కలియబెట్టుకోవాలి 11. చివరగా వేగించి పెట్టుకున్న రొయ్యలు వేయాలి 12. రుచికి తగిన ఉప్పు వేసుకోవాలి 13. కాసేపు ఉడికించి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని దింపుకోవాలి 14. చపాతీలోకి లేదా అన్నంలోకి ఈ రొయ్యల మసాల కర్రీ రుచిగా ఉంటుంది.
2
['tel']
నేను సింపుల్ చిల్లీ చికెన్! చాలా రుచికరంగా ఉంటుంది అని విన్నాను. నాకు ఇది ఎలా చెయ్యాలో సంక్లిప్తంగా చెప్పు.
సింపుల్ చిల్లీ చికెన్! కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసిన పదార్థాలు: 1. చికెన్ బ్రెస్ట్: 2 2. ఉప్పు: ఒక టీస్పూను 3. గుడ్డు: గిలక్కొట్టుకుని ఉంచుకోవాలి 4. మైదా పిండి: 3/4 కప్పు 5. బెంగుళూరు మిర్చి: 1 (సన్నగా 6. పొడవుగా ముక్కలు తరుక్కోవాలి) 7. రెడ్ పెప్పర్: 1 (సన్నగా 8. పొడవుగా ముక్కలు తరుక్కోవాలి) 9. వెల్లుల్లి: 3 (దంచుకోవాలి) 10. సోయా సాస్: 3 టేబుల్ స్పూన్లు 11. టమాటా ముద్ద: 2 టేబుల్ స్పూన్లు 12. నీళ్లు: అర కప్పు తయారీ విధానం: 1. చికెన్ ముక్కలను సన్నగా, పొడవాటి పట్టీల్లా కట్ చేసి పెట్టుకోవాలి 2. వాటిని మొదట గుడ్డు సొనలో ముంచి, తర్వాత మైదా పిండిలో దొర్లించాలి 3. ప్యాన్లో నూనె వేసి, ఈ ముక్కలను పరిచి, రెండు వైపులా బంగారు రంగుకు మారే వరకూ వేయించుకోవాలి 4. బెంగుళూరు మిర్చి, రెడ్ పెప్పర్ ముక్కలు కూడా వేసి మరో రెండు నిమిషాలు వేయించి, తీసి పక్కన పెట్టుకోవాలి 5. అదే ప్యాన్లో వెల్లుల్లి, కారం, సోయా సాస్, టమాటా ముద్ద, నీళ్లు వేసి కలిపి, చిన్న మంట మీద చిక్కబడేవరకూ ఉడికించుకోవాలి 6. తర్వాత పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసి, సాస్లో బాగా కలిసేలా కలుపుకోవాలి 7. రెండు నిమిషాలు ఉడికించి స్టవ్ నుంచి దించుకుని వేడిగా సర్వ్ చేసుకోవాలి.
3
['tel']
నేను క్విక్ చికెన్! చాలా రుచికరంగా ఉంటుంది అని విన్నాను. నాకు ఇది ఎలా చెయ్యాలో సంక్లిప్తంగా చెప్పు.
క్విక్ చికెన్! కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసిన పదార్థాలు: 1. చికెన్: కిలో 2. ఉల్లిపాయ పేస్ట్: ఒక కప్పు 3. టమాటా పేస్ట్: ఒక కప్పు 4. అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టేబుల్ స్పూను 5. ధనియాల పొడి: 2 టీస్పూన్లు 6. జీలకర్ర పొడి: 2 టీస్పూన్లు 7. పసుపు 8. ఉప్పు 9. నూనె: తగినంత 10. కారం: ఒకటిన్నర టీస్పూను 11. గరం మసాలా: ఒక టీస్పూను 12. కొత్తిమీర - ఒక కట్ట తయారీ విధానం: 1. ప్యాన్లో నూనె వేడి చేసి, ఉల్లి ముద్ద, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి, బంగారు రంగు వచ్చేవరకూ వేయించుకోవాలి 2. తర్వాత టమాటా ముద్ద వేసి, నీరు ఇగిరిపోయే వరకూ వేయించుకోవాలి 3. ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కారం, పసుపు, ఉప్పు, కారం వేసి కలుపుకోవాలి 4. రెండు నిమిషాలు ఉడికిన తర్వాత చికెన్ ముక్కలు వేసి కలుపుకోవాలి 5. ముక్కలు రంగు మారేవరకూ ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి 6. తర్వాత అర కప్పు నీళ్లు పోసి, కలుపుకుని, మూత పెట్టి చిన్న మంట మీద ఉడికించుకోవాలి 7. చికెన్ ముక్కలు ఉడికి, గ్రేవీ చిక్కబడే వరకూ ఉడికించి, చివర్లో కొత్తిమీర చల్లి స్టవ్ నుంచి దించుకోవాలి.
3
['tel']
హనీ గార్లిక్ చికెన్! రెసిపీ ఏంటి?
హనీ గార్లిక్ చికెన్! కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసిన పదార్థాలు: 1. ఆలివ్ ఆయిల్: రెండు టీ స్పూన్లు 2. బోన్లెస్ చికెన్: కిలో (అర అంగుళం ముక్కలు) 3. ఉప్పు 4. మిరియాల పొడి: తగినంత 5. తేనె: 3 టేబుల్ స్పూన్లు 6. సోయా సాస్: 3 టేబుల్ స్పూన్లు 7. వెల్లుల్లి పేస్ట్: ఒకటిన్నర స్పూను 8. మిరపకాయ విత్తనాలు: పావు టీస్పూను తయారీ విధానం: 1. గిన్నెలో ఆలివ్ ఆయిల్ వేడి చేసుకోవాలి 2. చికెన్ ముక్కలకు ఉప్పు, మిరియాల పొడి పట్టించాలి 3. తేనె, సోయా సాస్, వెల్లుల్లి ముద్ద, మిరపకాయ విత్తనాలు బాగా కలుపుకుని పెట్టుకోవాలి 4. వేడెక్కిన నూనెలో చికెన్ ముక్కలు వేసి, నాలుగు నిమిషాల పాటు ముక్కలు రంగు మారేవరకూ వేయించుకోవాలి 5. కలుపుకున్న మసాలా ముద్దను చికెన్లో వేసి, మసాలా ముక్కలకు పట్టేలా నాలుగు లేదా ఐదు నిమిషాల పాటు కలుపుతూ ఉడికించాలి 6. చికెన్ ముక్కలు చిన్నవే కాబట్టి త్వరగా ఉడికిపోతాయి 7. కాబట్టి అవసరానికి మించి ఉడికించుకోకూడదు 8. స్టవ్ నుంచి దించి, కొత్తిమీర, నువ్వులతో అలంకరించి, వేడి అన్నంతో పాటు సర్వ్ చేయాలి.
7
['tel']
మీరు తలకాయ కూర తయారు చెయ్యడానికి ఎటువంటి తిండి పదార్ధాలు వాడుతురు మరియు ఏ విధముగా చేస్తారో వివరణ ఇవ్వండి.
తలకాయ కూర కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. మేక తలకాయ మాంసం - అరకేజీ 2. కొత్తిమీర - ఒకకట్ట 3. గరంమసాల - ఒక టీస్పూన్ 4. కొబ్బరి తురుము - ఒక టేబుల్స్పూన్ 5. ధనియాల పొడి - ఒక టీస్పూన్ 6. మిరియాల పొడి - అర టీస్పూన్ 7. కారం - ఒక టీస్పూన్ 8. పసుపు - పావు టీస్పూన్ 9. అల్లంవెల్లుల్లి పేస్ట్ - ఒక టీస్పూన్ 10. ఉల్లిపాయ - ఒకటి 11. ఉప్పు - రుచికి తగినంత 12. నూనె - సరిపడా 13. నల్ల జీలకర్ర - పావు టీస్పూన్. తయారీ విధానం: 1. స్టవ్పై కుక్కర్ పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఉల్లిపాయలు వేసి వేయించాలి 2. తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం వేయాలి 3. కాసేపు వేగిన తరువాత తలకాయ మాంసం వేయాలి 4. తగినంత ఉప్పు వేసి, కొన్ని నీళ్లు పోసి ఇరవై నిమిషాల పాటు ఉడికించాలి.ఆవిరిపోయిన తరువాత కూరను పాన్లోకి మార్చుకుని మళ్లీ స్టవ్పై పెట్టాలి 5. మిరియాల పొడి, ధనియాల పొడి, గరంమసాల, కొబ్బరి తురుము వేసి కలుపుకోవాలి.కాసేపు ఉడికిన తరువాత కొత్తిమీర వేసి దింపుకోవాలి.
2
['tel']
మొదటిసారి వంట చేసేవారికి చెప్పినట్టు నాకు కబాబ్స్ ఎలా చెయ్యాలొ చెప్పు
కబాబ్స్ కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. ఖీమా - 150గ్రాములు 2. చికెన్ బోన్లెస్ - 100గ్రాములు 3. అల్లంవెల్లుల్లి పేస్టు - రెండు టీస్పూన్లు 4. ఉల్లిపాయ పేస్టు - ఒక టేబుల్స్పూన్ 5. కారం - ఒక టీస్పూన్ 6. ధనియాల పొడి - ఒకటీస్పూన్ 7. జీలకర్రపొడి - ఒక టీస్పూన్ 8. మిరియాల పొడి - పావు టీస్పూన్ 9. ఆమ్చూర్ పౌడర్ - ఒక టీస్పూన్ 10. శొంఠిపొడి - పావు టీస్పూన్ 11. నూనె - సరిపడా 12. జీడిపప్పు పేస్టు - ఒకటిన్నర టేబుల్స్పూన్ 13. క్రీమ్ - ఒకటిన్నర టేబుల్స్పూన్,  శనగపిండి - రెండు టేబుల్స్పూన్లు 14. కోడిగుడ్డు పచ్చసొన - ఒకటి 15. ఉప్పు - రుచికి తగినంత 16. కొత్తిమీర - గార్నిష్ కోసం ఒకకట్ట. తయారీ విధానం: 1. ఒక బౌల్లో ఖీమా, చికెన్ వేసి బాగా కలపాలి 2. తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ పేస్టు, కారం, ధనియాల పొడి, జీలకర్రపొడి, మిరియాల పొడి, ఆమ్చూర్పౌడర్, శొంఠిపొడి, జీడిపప్పు పేస్టు, క్రీమ్, కొద్దిగా నూనె వేసి బాగా కలపాలి.తరువాత శనగపిండి, కోడిగుడ్డు వేసి కలియబెట్టాలి 3. తగినంత ఉప్పు వేసుకోవాలి 4. మూత పెట్టి ఫ్రిజ్లో ఒక గంట పాటు పెట్టాలి.ఇప్పుడు మిశ్రమాన్ని బయటకు తీసి కొద్దికొద్దిగా తీసుకుంటూ పుల్లలకు గుచ్చాలి 5. నూనె వేసుకుంటూ గ్రిల్ చేసుకోవాలి 6. సర్వింగ్ ప్లేట్లోకి మార్చుకుని ఉల్లిపాయలు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని కబాబ్స్ సర్వ్ చేసుకోవాలి.
4
['tel']
మటన్ రోస్ట్ రెసిపీ ఏంటి?
మటన్ రోస్ట్ కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. మటన్ - అరకేజీ 2. మిరియాల పొడి - అర టీస్పూన్ 3. ఉప్పు - రుచికి తగినంత 4. పసుపు - పావు టీస్పూన్ 5. నూనె - సరిపడా 6. ఉల్లిపాయ - ఒకటి 7. టొమాటో - ఒకటి 8. అల్లం - రెండు అంగుళాల ముక్క 9. వెల్లుల్లి - ఐదారు రెబ్బలు 10. కారం - ముప్పావు టీస్పూన్ 11. ధనియాల పొడి - పావు టీస్పూన్ 12. గరంమసాల - అరటీస్పూన్ 13. సోంపు - అర టీస్పూన్ 14. కరివేపాకు - రెండు రెమ్మలు 15. ఉప్పు - తగినంత. తయారీ విధానం: 1. మటన్ను శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి మిరియాల పొడి, పసుపు వేసి ఒక కప్పు నీళ్లు పోసి ఉడికించాలి.మొదటి విజిల్ వచ్చే వరకు పెద్ద మంటపై ఉడికించాలి 2. తరువాత చిన్నమంటపై అరగంటపాటు ఉడికించాలి 3. కుక్కర్లో ఆవిరిపోయాక మటన్ను ఒక బౌల్లోకి మార్చుకోవాలి 4. స్టవ్పై పాన్ పెట్టి నూనె పోసి వేడి అయ్యాక తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించాలి 5. సోంపు, దంచిన అల్లంవెల్లుల్లి, కరివేపాకు వేయాలి.కారం, ధనియాల పొడి, గరంమసాల, తగినంత ఉప్పు వేసి కలపాలి 6. కాసేపు వేయించుకున్నాక టొమాటో ముక్కలు వేసి మరో రెండుమూడు నిమిషాలు ఉడకనివ్వాలి.ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న మటన్ మిశ్రమాన్ని వేయాలి 7. పెద్ద మంటపై కాసేపు ఉడికించుకుని దింపుకోవాలి.
7
['tel']
మీరు మటన్ కట్లెట్స్ తయారు చెయ్యడానికి ఎటువంటి తిండి పదార్ధాలు వాడుతురు మరియు ఏ విధముగా చేస్తారో వివరణ ఇవ్వండి.
మటన్ కట్లెట్స్ కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. మటన్ - అరకేజీ(బోన్లెస్) 2. అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్స్పూన్ 3. ఉల్లిపాయ - ఒకటి 4. కొత్తిమీర - ఒకకట్ట 5. పుదీనా - ఒక కట్ట 6. పచ్చిమిర్చి - రెండు 7. కారం - రెండు టీస్పూన్లు 8. పసుపు - అర టీస్పూన్ 9. బంగాళదుంప - ఒకటి 10. ఉప్పు - రుచికి తగినంత 11. లవంగాలు - రెండు 12. దాల్చిన చెక్క - చిన్నముక్క 13. నూనె - డీప్ ఫ్రైకి సరిపడా 14. గోధుమ బ్రెడ్ క్రంబ్స్ - కొద్దిగా. తయారీ విధానం: 1. ముందుగా మటన్ను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి 2. కొత్తిమీర, పుదీనాను కట్ చేసుకోవాలి 3. బంగాళదుంపను ఉడికించి పొట్టుతీసి గుజ్జుగా చేసుకోవాలి 4. ఉల్లిపాయ, పచ్చిమిర్చిని తరగాలి 5. మటన్ను కడిగిన తరువాత నీళ్లు లేకుండా చేతితో గట్టిగా పిండాలి 6. తరువాత ఒక బౌల్లోకి తీసుకుని అందులో అల్లంవెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, కారం, పసుపు, బంగాళదుంప, లవంగాలు, దంచిన దాల్చిన చెక్క, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి 7. ఇప్పుడు మిశ్రమాన్ని నిమ్మకాయ సైజంత చేతుల్లోకి తీసుకుని కట్లెట్స్లా ఒత్తుకోవాలి 8. తరువాత బ్రెండ్ క్రంబ్స్ అద్దుకుంటూ పక్కన పెట్టుకోవాలి 9. స్టవ్పై పాన్ పెట్టి నూనె పోసి కాస్త వేడి అయ్యాక కట్లెట్స్ వేసుకుంటూ వేయించాలి 10. చిన్నమంటపై రెండు వైపులా బాగా కాలేలా వేయించుకోవాలి 11. పుదీనా చట్నీతో తింటే ఈ మటన్ కట్లెట్స్ రుచిగా ఉంటాయి.
2
['tel']
ముర్గ్ మలాయి కబాబ్ ఎలా తయారు చేస్తారో క్లుప్తంగా ఇవ్వండి.
ముర్గ్ మలాయి కబాబ్ కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. బోన్లెస్ చికెన్ - ఒకకేజీ 2. ఉప్పు - తగినంత 3. పచ్చిమిర్చి - 100గ్రా 4. నిమ్మకాయలు - నాలుగు 5. అల్లంవెల్లుల్లి పేస్టు - 50గ్రా 6. పెరుగు - 100గ్రా 7. జీడిపప్పు - 100గ్రా 8. జీలకర్ర పొడి - 50గ్రా 9. మెంతిపొడి - 50గ్రా 10. గరంమసాల - 50గ్రా 11. తెల్లమిరియాల పొడి - 50గ్రా 12. కుకింగ్ క్రీమ్ - 100ఎంఎల్. తయారీ విధానం: 1. చికెన్ను శుభ్రం చేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి 2. తరువాత నిమ్మరసం, అల్లంవెల్లుల్లి పేస్టు కలిపి, తగినంత ఉప్పు వేసి మారినేట్ చేసుకోవాలి 3. ఒక పాత్రలో పెరుగు తీసుకుని అందులో జీడిపప్పు పేస్టు, జీలకర్రపొడి, మెంతిపొడి, మిరియాలపొడి, గరంమసాల, కుకింగ్ క్రీమ్ వేసి కలుపుకొని మసాలా సిద్ధం చేసుకోవాలి 4. ఇప్పుడు మారినేట్ చేసిన చికెన్ ముక్కలను మసాలాలో వేసి ముక్కలకు మసాలా పట్టేలా కలపాలి 5. తరువాత చికెన్ ముక్కలను పుల్లకు గుచ్చాలి 6. తందూరీ పాట్లో ఉడికించాలి 7. పుదీనా చట్నీతో సర్వ్ చేసుకోవాలి.
1
['tel']
మరాక్ ఎలా చేయాలి? సమాధానం లో కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఉండాలి.
మరాక్ కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. మటన్ బోన్స్-కేజీ 2. ఉల్లిపాయలు- 100గ్రా 3. పచ్చిమిర్చి- 50గ్రా 4. అల్లంవెల్లుల్లి పేస్టు -50గ్రా 5. ధనియాలు- 30గ్రా,మిరియాలు- 30గ్రా 6. ఉప్పు- తగినంత 7. నూనె- సరిపడా 8. కారం- 50గ్రా 9. కొత్తిమీరవేళ్లు- కొద్దిగా 10. పాన్ కి జాద్- 50గ్రా 11. ఖుస్ కి జాద్ - 50గ్రా. తయారీ విధానం: 1. ఒక పాత్రలో మటన్ బోన్స్ తీసుకుని అందులో కొత్తిమీర వేళ్లు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి 2. నీళ్లు మరిగాక స్టవ్పై దింపి వడగట్టుకుని స్టాక్ని పక్కన పెట్టుకోవాలి 3. స్టవ్పై ఒక పాత్రను పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఉల్లిపాయలు వేసి వేగించాలి 4. తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు, మిరియాలు, ధనియాలు, పాన్ కి జాద్, ఖుస్ కి జాద్ వేసి మరికాసేపు వేగించాలి 5. ఇప్పుడు మటన్ వేసి మరికాసేపు ఉడికించాలి 6. తరువాత పక్కన పెట్టుకున్న స్టాక్ వేసి మరిగించాలి 7. ఎముక మజ్జ బయటకు వచ్చేంత వరకు ఉడికించాలి 8. తగినంత ఉప్పు వేసుకోవాలి 9. వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి.
5
['tel']
చాట్పటి మచ్చీ ఎలా తయారు చేస్తారో క్లుప్తంగా ఇవ్వండి.
చాట్పటి మచ్చీ కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. మ్యురెల్ చేప - ఒకకేజీ 2. నిమ్మకాయలు - నాలుగు 3. అల్లం వెల్లుల్లి పేస్టు - 100గ్రా 4. పెరుగు - 50గ్రా 5. పుదీనా పేస్టు - 100గ్రా 6. జీలకర్రపొడి - 50గ్రా 7. గరంమసాల - 50గ్రా 8. యెల్లో కలర్ - చిటికెడు 9. ఉప్పు - తగినంత 10. కారం - 50గ్రా 11. కస్తూరీ మెంతి పొడి - 50గ్రా. తయారీ విధానం: 1. చేపలను శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి 2. తరువాత వాటికి అల్లంవెల్లుల్లి పేస్టు, నిమ్మరసం, తగినంత ఉప్పు వేసి కలుపుకొని మారినేట్ చేసుకోవాలి 3. ఒక పాత్రలో పెరుగు తీసుకుని అందులో జీలకర్రపొడి, గరంమసాల, కారం, మెంతిపొడి, యెల్లో కలర్ వేసి కలుపుకోవాలి 4. తరువాత అందులో మారినేట్ చేసుకున్న చేప ముక్కలను వేసి మసాలా పట్టేలా కలుపుకోవాలి 5. ఇప్పుడు చేప ముక్కలను పుల్లలకు గుచ్చి క్లే ఓవెన్లో ఉడికించుకోవాలి.వేడి వేడిగా సర్వ్ చేయాలి.
1
['tel']
హైదరాబాద్ దమ్ కా ముర్గ్ రెసిపీ ఏంటి?
హైదరాబాద్ దమ్ కా ముర్గ్ కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. చికెన్ లెగ్ పీస్లు - 800గ్రా(బోన్లెస్) 2. జీడిపప్పు - 200గ్రా 3. బాదం - 50గ్రా 4. ఖుస్ఖుస్ - 50గ్రా 5. సారపప్పు(చిరోంజి) - 50గ్రా 6. ఉల్లిపాయలు - 200గ్రా 7. నెయ్యి - 100గ్రా 8. టొమాటో - 400గ్రా 9. పెరుగు -200గ్రా 10. మిరియాలపొడి - 10గ్రా 11. కారం - 20గ్రా 12. నూనె - సరిపడా 13. అల్లంవెల్లుల్లి పేస్టు - 100గ్రా 14. గరంమసాల - 20గ్రా 15. పుదీనా - 50గ్రా 16. ఉప్పు - తగినంత 17. ఎండు కొబ్బరి - 100గ్రా 18. పసుపు - 20గ్రా 19. పచ్చిమిర్చి పేస్టు - 50గ్రా. తయారీ విధానం: 1. చికెన్ను శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి 2. ఫ టొమాటోలను ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి పేస్టు చేయాలి 3. జీడిపప్పును పేస్టు చేసుకోవాలి 4. ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి 5. సారపప్పు, ఎండుకొబ్బరి, ఖుస్ఖుస్, బాదం పలుకులను పాన్పై వేసి వేగించి, పేస్టు చేసుకోవాలి 6. స్టవ్పై పాన్ పెట్టి నెయ్యి, నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఉల్లిపాయలు వేసి వేగించాలి 7. తరువాత టొమాటో పేస్టు, డ్రై ఫ్రూట్ పేస్టు వేసి కలపాలి 8. పెరుగు కూడా వేసి కలియబెట్టుకొని గ్రేవీ రెడీ చేసుకోవాలి 9. ఇప్పుడు స్టవ్పై మరొక పాన్ పెట్టి నూనె వేసి అల్లం వెల్లుల్లి పేస్టు వేగించాలి 10. తరువాత చికెన్ ముక్కలు వేయాలి 11. తగినంత ఉప్పు, కారం వేసి ముక్కలు వేగించాలి 12. ఇప్పుడు సిద్ధంగా ఉన్న గ్రేవీ వేసి మరికాసేపు ఉడికించాలి 13. కొత్తిమీర గార్నిష్తో సర్వ్ చేసుకోవాలి.
7
['tel']
మటన్ లుక్మీ ఎలా చేయాలి? సమాధానం లో కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఉండాలి.
మటన్ లుక్మీ కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. మటన్ కీమా - 200గ్రా 2. ఉల్లిపాయలు - 20గ్రా 3. అల్లంవెల్లుల్లి పేస్టు - 10గ్రా 4. కారం - 15గ్రా 5. ధనియాల పొడి - 50గ్రా 6. గరంమసాలా - 5గ్రా 7. పసుపు - 5గ్రా 8. నూనె - 400ఎంఎల్ 9. మైదా - 100గ్రా 10. ఉప్పు - రుచికి తగినంత 11. కొత్తిమీర - 15గ్రా 12. నెయ్యి లేదా డాల్డా - 25గ్రా. తయారీ విధానం: 1. మటన్ కీమాలో అల్లంవెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, తగినంత ఉప్పు వేసి మారినేట్ చేసుకోవాలి 2. స్టవ్పై కడాయి పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక తరిగిన ఉల్లిపాయలు వేసి గోధుమరంగులోకి మారే వరకు వేగించాలి 3. తరువాత మారినేట్ చేసుకున్న మటన్ వేసి చిన్నమంటపై ఉడికించాలి 4. ధనియాల పొడి, గరంమసాల చల్లి దింపాలి 5. ఇప్పుడు ఒక పాత్రలో మైదాపిండి తీసుకుని అందులో నెయ్యి, తగినంత ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి మిశ్రమంలా కలిపి 20 నిమిషాల పాటు పక్కన పెట్టాలి 6. మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ వెడల్పుగా ఒత్తుకోవాలి 7. మధ్యలో మటన్ మిశ్రమం పెట్టి మరో లేయర్తో మూసేయాలి 8. నీళ్లు అద్దుతూ చివరలు మూయాలి 9. వీటిని చిన్నమంటపై నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి 10. వేడి వేడిగా తింటే మటన్ లుక్మీ రుచిగా ఉంటుంది.
5
['tel']
నేను దమ్ హండీ కా ఘోష్ చాలా రుచికరంగా ఉంటుంది అని విన్నాను. నాకు ఇది ఎలా చెయ్యాలో సంక్లిప్తంగా చెప్పు.
దమ్ హండీ కా ఘోష్ కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. మటన్ స్టాక్ - 200గ్రా 2. మటన్ - 700గ్రా 3. జీడిపప్పు పేస్టు - 50గ్రా 4. ఉప్పు - రుచికి తగినంత 5. ఉల్లిపాయలు తరిగినవి - పావుకేజీ 6. నూనె - 100ఎంఎల్ 7. హోల్ గరంమసాల - 5గ్రా 8. టొమాటో ప్యూరీ - 350గ్రా 9. కారం - 15గ్రా 10. ధనియాల పొడి - 10గ్రా 11. పెరుగు - 150గ్రా 12. అల్లంవెల్లుల్లి పేస్టు - 10గ్రా 13. కొత్తిమీర - 10గ్రా 14. గరంమసాల పొడి - 5గ్రా. తయారీ విధానం: 1. స్టవ్పై కడాయి పెట్టి నూనె వేసి వేడి అయ్యాక హోల్ గరంమసాల వేయాలి 2. మసాలా వేగిన తరువాత ఉల్లిపాయలు వేయాలి 3. ఉల్లిపాయలు వేగిన తరువాత అల్లంవెల్లుల్లి పేస్టు వేసి కలుపుకోవాలి.ఇప్పుడు మటన్ వేసి కలియబెట్టుకోవాలి 4. కాసేపు ఉడికిన తరువాత టొమాటో ప్యూరీ వేయాలి.మటన్ బాగా ఉడికి నూనెను వదిలేసిన సమయంలో గరంమసాలా పొడి, ధనియాల పొడి, కారం, పెరుగు వేసి కలుపుకోవాలి 5. తరువాత మటన్ స్టాక్ వేసి మరోసారి ఉడికించుకోవాలి 6. కాసేపయ్యాక జీడిపప్పు పేస్టు వేసుకోవాలి 7. తగినంత ఉప్పు వేసుకోవాలి.మూతపెట్టి చిన్నమంటపై మటన్ మెత్తగా ఉడికేంత వరకు ఉంచుకోవాలి.చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి.
3
['tel']
మీరు చులే కా దమ్ ముర్గ్ తయారు చెయ్యడానికి ఎటువంటి తిండి పదార్ధాలు వాడుతురు మరియు ఏ విధముగా చేస్తారో వివరణ ఇవ్వండి.
చులే కా దమ్ ముర్గ్ కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. చికెన్ - 700గ్రా 2. ఉల్లిపాయలు - 300గ్రా 3. టొమాటో ప్యూరీ - 200గ్రా 4. జీడిపప్పు పేస్టు - 150గ్రా 5. నెయ్యి - 150గ్రా 6. హోల్ గరంమసాలా - 10గ్రా 7. చికెన్ స్టాక్ - 300ఎంఎల్ 8. ఉప్పు - రుచికి తగినంత 9. ధనియాల పొడి - 10గ్రా 10. గరంమసాల పొడి - 5గ్రా 11. పసుపు - 10గ్రా 12. కారం - 5గ్రా 13. కెవ్రా వాటర్ - 5ఎంఎల్ 14. అల్లంవెల్లుల్లి పేస్టు - 10గ్రా 15. కొత్తిమీర - 10గ్రా. తయారీ విధానం: 1. స్టవ్పై కడాయి పెట్టి నెయ్యి వేసి వేడి అయ్యాక హోల్ గరంమసాల వేయాలి 2. కాసేపు వేయించిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేయాలి 3. ఇప్పుడు చికెన్ వేసి కలుపుకోవాలి 4. ఉల్లిపాయలను పేస్టులా చేసి వేసుకుని, కాసేపు ఉడికించుకోవాలి.తరువాత టొమాటో ప్యూరీ తగినంత కారం వేసి ఉడికించాలి.బాగా ఉడికిన నూనె తేలిన తరువాత గరంమసాల పొడి, ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసి కలియబెట్టుకోవాలి 5. చికెన్ స్టాక్, కెవ్రా వాటర్ వేసి మరికాసేపు ఉడికించుకోవాలి.జీడిపప్పు పేస్టు వేసి గ్రేవీ చిక్కగా అయ్యేంత వరకు ఉంచుకుని దింపుకోవాలి.కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.
2
['tel']
ఫ్రైడ్ చికెన్ రెసిపీ ఏంటి?
ఫ్రైడ్ చికెన్ కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. చికెన్ బ్రెస్ట్లు - ఆరు 2. ఎగ్వైట్ - రెండు 3. ఉప్పు - కొద్దిగా 4. నువ్వులు - అర కప్పు 5. నూనె - సరిపడా. తయారీ విధానం: 1. ముందుగా చికెన్ బ్రెస్ట్లను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి 2. ఒక పాత్రలో ఎగ్వైట్లు తీసుకుని కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి 3. మరొక ప్లేట్లో నువ్వులు తీసుకోవాలి 4. ఇప్పుడు చికెన్ ముక్కలను ఎగ్వైట్లో డిప్ చేసి, నువ్వులు సమంగా అంటేలా అద్దాలి 5. తరువాత ఫ్రిజ్లో పెట్టుకోవాలి 6. స్టవ్పై డీప్ ఫ్రై పాన్ పెట్టి నూనె పోయాలి 7. నూనె వేడి అయ్యాక చికెన్ ముక్కలు వేసి వేగించాలి 8. ఐదు నిమిషాల పాటు వేగిన తరువాత ముక్కలు మరోవైపు తిప్పి మరికాసేపు వేగించి తీసుకోవాలి 9. నువ్వుల చికెన్ బ్రెస్ట్లను చిల్లీ సాస్తో కలిపి సర్వ్ చేయాలి.
7
['tel']
బొమ్మిడాయిలు పాలకూర ఎలా చేయాలి? సమాధానం లో కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఉండాలి.
బొమ్మిడాయిలు పాలకూర కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. ఎండు బొమ్మిడాయిలు - 4 2. పాలకూర తరుగు - 2 కప్పులు / 4 కట్టలు 3. ఉల్లిపాయలు - 3,  పచ్చిమిర్చి - 2 4. కరివేపాకు - 2 రెబ్బలు 5. అల్లం వెల్లుల్లి ముద్ద - ఒక టీ స్పూన్ 6. పసుపు - పావు టీస్పూన్ 7. కారం పొడి - ఒక టేబుల్స్పూన్ 8. గరంమసాలా పొడి - పావు టీస్పూన్ 9. చింతపండు పులుసు - పావు కప్పు 10. ఉప్పు - తగినంత 11. నూనె - మూడు టేబుల్స్పూన్లు. తయారీ: 1. బొమ్మిడాయిలు తల, తోకా తీసేసి మూడు అంగుళాల ముక్కలుగా కట్ చేసుకోవాలి 2. తరువాత పెనంలో కొద్దిగా నూనె వేసి వీటిని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి 3. వెడల్పాటి గిన్నె లేదా కడాయిలో మిగిలిన నూనె వేసి వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి మెత్తబడేవరకు వేగించాలి 4. పాలకూర శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి 5. ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత పసుపు, కారం పొడి, అల్లం వెల్లుల్లి ముద్ద, కరివేపాకు వేసి కలపాలి 6. తర్వాత వేగించిన బొమ్మిడాయి ముక్కలు వేసి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి.. 7. ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత పాలకూర తరుగు, తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి 8. నీళ్లు అవసరముంటే కొద్దిగా పోయాలి 9. బొమ్మిడాయిలు, పాలకూర ఉడికి దగ్గరగా అయిన తర్వాత చింతపండు పులుసు, గరం మసాలా పొడి వేసి కలిపి చిన్నమంట మీద మరి కొద్దిసేపు ఉడికించి దింపాలి.
5
['tel']
మొదటిసారి వంట చేసేవారికి చెప్పినట్టు నాకు బోటీ చారు / దప్పడం ఎలా చెయ్యాలొ చెప్పు
బోటీ చారు / దప్పడం కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. బోటీ ముక్కలు - రెండు కప్పులు 2. ఉల్లిపాయలు - రెండు 3. టొమాటోలు - రెండు 4. బెండకాయలు - 8 5. చింతపండు పులుసు - ఒక కప్పు 6. అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్ 7. పసుపు - పావు టీస్పూన్ 8. కారం - ఒక టీస్పూన్ 9. ధనియాలపొడి - ఒక టీస్పూన్ 10. గరంమసాలా - పావు టీస్పూన్ 11. బియ్యప్పిండి - రెండు టేబుల్స్పూన్లు 12. కరివేపాకు - రెండు రెబ్బలు 13. కొత్తిమీర - కొద్దిగా 14. ఉప్పు - తగినంత 15. నూనె - మూడు టీస్పూన్లు. తయారీ: 1. ముందుగా బోటీ శుభ్రంగా కడిగి, కుక్కర్లో వేసి అయిదు కప్పుల నీళ్లు పోయాలి 2. అందులో కొద్దిగా పసుపు, ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద వేసి మూతపెట్టి ఉడికించుకోవాలి 3. విడిగా ఒక మందపాటి గిన్నెలో పలుచగా చేసిన చింతపండు పులుసు, కాస్త పెద్దగా తరిగిన ఉల్లిపాయ, టొమాటో ముక్కలు, రెండు అంగుళాల సైజులో కట్ చేసిన బెండకాయ ముక్కలు, కరివేపాకు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు,  ధనియాల పొడి, ఉప్పు వేసి కలిపి ఉడికించాలి 4. ఇవి సగం ఉడికిన తర్వాత ఉడికించి పెట్టుకున్న బోటీ ముక్కలు వేయాలి 5. ఇందులో నూనె, గరం మసాలా, కొత్తిమిర వేసి కలిపి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి 6. చివరగా అరకప్పు నీళ్లలో బియ్యప్పిండి వేసి కలిపి మరుగుతున్న చారులో వేసి ఉండలు కట్టకుండా కలపాలి 7. రెండు నిమిషాలు ఉడికి చిక్కబడిన తర్వాత ఉప్పు సరిచూసుకుని దింపేయాలి 8. ఇష్టముంటే నిమ్మకాయ పిండుకోవచ్చు.
4
['tel']
కాళ్ల కూర / పాయ ఎలా తయారు చేస్తాం?
కాళ్ల కూర / పాయ కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. మేక కాళ్లు - ఐదు 2. ఉల్లిపాయలు - రెండు 3. పచ్చిమిర్చి - రెండు 4. కొత్తిమీర తరుగు - పావు కప్పు 5. పుదీనా తరుగు - పావు కప్పు 6. అల్లం వెల్లుల్లి పేస్టు - ఒకటిన్నర టీస్పూన్ 7. పసుపు - పావు టీస్పూన్ 8. కారం - రెండు టీస్పూన్లు 9. ధనియాల పొడి - రెండు టేబుల్స్పూన్లు 10. గరంమసాలా - అర టీస్పూన్ 11. చింతపండు పులుసు - అరకప్పు 12. నూనె - మూడు టేబుల్స్పూన్లు 13. ఉప్పు - తగినంత. తయారీ: 1. మేక కాళ్లు కాల్చి పసుపు రాసి, నీటితో శుభ్రం చేసుకోవాలి 2. తరువాత మూడు అంగుళాల సైజులో ముక్కలుగా కట్ చేయాలి 3. కుక్కర్లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి వేగించాలి 4. తరువాత అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, ధనియాల పొడి, పుదీనా, కొత్తిమీర వేసి వేగించాలి 5. కాసేపు వేగిన తరువాత కాళ్లు, గరంమసాలా వేసి కలపాలి 6. ఇప్పుడు ఐదు గ్లాసుల నీళ్లు, చింతపండు పులుసు పోసి, తగినంత ఉప్పు వేసి మూత పెట్టి 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి 7. పాయ కోసం పోట్లీ మసాలా అని దొరుకుతుంది 8. ఆ పొడి ఒక స్పూన్, కొన్ని మసాల దినుసులు ఒకచిన్న వస్త్రంలో వేసి కట్టాలి 9. దీన్ని కాళ్లతోపాటు ఉడికిస్తే ఆ రుచి వేరుగా ఉంటుంది 10. పాయలోకి గోధుమ రొట్టెలు, జొన్న రొట్టెలు, నాన్ రుచిగా ఉంటాయి.
6
['tel']
మొదటిసారి వంట చేసేవారికి చెప్పినట్టు నాకు పచ్చిమిర్చి కోడి పులావు ఎలా చెయ్యాలొ చెప్పు
పచ్చిమిర్చి కోడి పులావు కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. చికెన్ - ఒకకేజీ 2. బాస్మతి బియ్యం - ముప్పావు కేజీ 3. ఉల్లిపాయలు - రెండు,  పచ్చిమిర్చి - పావు టీస్పూన్ 4. పసుపు - పావు టీస్పూన్ 5. కొత్తిమిర తరుగు - అరకప్పు 6. పుదీనా తరుగు - అరకప్పు,  అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు టీస్పూన్లు 7. మిరియాల పొడి - అర టీస్పూన్ 8. ధనియాల పొడి - రెండు టీస్పూన్లు 9. గరం మసాలా పొడి - పావు టీస్పూన్ 10. పెరుగు - 100గ్రా. 11. నూనె - మూడు టేబుల్స్పూన్లు 12. నెయ్యి - రెండు టీస్పూన్లు. యాలకులు -  4 లవంగాలు - 5 13. 14. దాల్చిన చెక్క - అంగుళం ముక్క 15. షాజీరా - ఒక టీస్పూన్. తయారీ: 1. చికెన్ ముక్కలు కడిగి జల్లెడలో వేసి పెట్టుకోవాలి 2. పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, తాజా గరంమసాలా దినుసులు వేసి మెత్తగా గైరండ్ చేసుకోవాలి 3. మందపాటి గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి దోరగా వేగించాలి 4. ఎర్రగా వేగిన కొన్ని ఉల్లిపాయలు తీసి పక్కనపెట్టుకోవాలి 5. ఉల్లిపాయలలో నూరి పెట్టుకున్న పచ్చిమిర్చి ముద్ద, అల్లం వెల్లుల్లి ముద్ద పసుపు వేసి కొద్దిసేపు వేగించాలి 6. చికెన్ ముక్కలు, తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి 7. ముక్కలన్నీ నూనెలో మగ్గి, వేగిన తర్వాత పెరుగు వేసి కలిపి అరకప్పు నీళ్లు పోసి చిన్న మంట మీద ఉడకనివ్వాలి 8. బాస్మతి బియ్యం కడిగి నీళ్లు పోసి పదిహేను నిమిషాలు నాననివ్వాలి 9. వేరే పెద్ద గిన్నెలో నీళ్లు తీసుకోవాలి 10. ఇందులో  యాలకులు, లవంగాలు, దాల్చిన, షాజీర వేసి బియ్యానికి తగిన ఉప్పు వేసి మరిగించాలి 11. నీళ్లు మరుగుతున్నప్పుడు నీళ్ల నుంచి బియ్యం తీసి వేయాలి 12. బియ్యం ముప్పావు వంతు ఉడకగానే దింపేసి జల్లెడలో వేయాలి 13. చికెన్ ఉడుకుతుండగానే బియ్యం రెడీ చేసుకోవాలి 14. తడి ఆరకూడదు 15. చికెన్ ఉడికిన తర్వాత ఈ ఉడికిన బియ్యం వేసి పైన ఎర్రగా వేగించిన ఉల్లిపాయలు, నెయ్యి వేసి మూత పెట్టాలి 16. మీడియం మంట మీద మరో పది నిమిషాలు ఉంచి తర్వాత దింపేసి వడ్డించుకోవాలి.
4
['tel']
మొదటిసారి వంట చేసేవారికి చెప్పినట్టు నాకు తెలంగాణ చికెన్ కూర ఎలా చెయ్యాలొ చెప్పు
తెలంగాణ చికెన్ కూర కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. చికెన్ - ఒక కేజీ 2. ఉల్లిపాయలు - మూడు 3. పచ్చిమిర్చి - మూడు 4. కరివేపాకు - రెండు రెబ్బలు 5. కొత్తిమీర తరుగు - పావు కప్పు 6. అల్లం వెల్లుల్లి పేస్టు - ఒకటిన్నర టీస్పూన్ 7. ధనియాల పొడి - రెండు టేబుల్స్పూన్లు 8. గరంమసాలా పొడి - అర టీస్పూన్ 9. పసుపు - పావు టీస్పూన్ 10. కారం - రెండున్నర టీస్పూన్లు 11. కొబ్బరిపొడి - మూడు టేబుల్స్పూన్లు 12. గసగసాలు - 2 టీస్పూన్లు 13. టొమాటోలు - 2 14. ఉప్పు - తగినంత 15. నూనె - నాలుగు టేబుల్స్పూన్లు. తయారీ: 1. చికెన్ ముక్కలు కడిగి జల్లెడలో వేసి పెట్టాలి 2. గసాలు కొద్దిగా వేగించి పొడి చేసి పెట్టుకోవాలి 3. మందపాటి గిన్నె లేదా పాన్లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి దోరగా వేయించాలి 4. ఇందులో పసుపు, కారం పొడి, కరివేపాకు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కొద్దిగా వేగించాలి.తరువాత చికెన్ ముక్కలు, తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి 5. ముక్కలు నూనెలో మగ్గి నీరంతా ఇగిరిపోయిన తర్వాత కొబ్బరి పొడి, గసగసాల పొడి, సన్నగా తరిగిన టొమాటో ముక్కలు వేసి కలపాలి 6. ఒక కప్పు నీళ్లు పోసి కలిపి మూతపెట్టి ఉడకనివ్వాలి 7. ముక్కలు ఉడికి నూనె పైకి తేలుతున్నప్పుడు గరం మసాలా పొడి, కొత్తిమీర వేసి కలిపి దింపాలి.
4
['tel']
షిడోల్ చేప కర్రీ ఎలా తయారు చేస్తాం?
షిడోల్ చేప కర్రీ కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. షిడోల్ చేపలు - పది 2. గుమ్మడికాయ - పావుకేజీ 3. ఉల్లిపాయ - ఒకటి 4. వెల్లుల్లి రెబ్బలు - పదిహేను 5. పచ్చిమిర్చి - మూడు 6. పసుపు - ఒక టీస్పూన్ 7. కారం - ఒక టీస్పూన్ 8. ఆవాల నూనె - ఐదు టేబుల్స్పూన్లు 9. ఉప్పు - రుచికి తగినంత 10. గోరువెచ్చని నీళ్లు - ఒక కప్పు. తయారీ: 1. గోరువెచ్చటి నీళ్లతో షిడోల్ చేపలను శుభ్రం చేయాలి 2. చేపల తల భాగాన్ని తీసేయాలి 3. స్టవ్పై పాన్ పెట్టి రెండు టేబుల్స్పూన్ల నూనె వేసి కాస్త వేడి అయ్యాక గుమ్మడికాయ ముక్కలు వేసి వేగించాలి 4. కొద్ది పసుపు, ఉప్పు వేసి కలియబెట్టాలి 5. మూత పెట్టి కాసేపు ఉడికించాలి 6. గుమ్మడికాయ ముక్కలను మెత్తగా అయ్యే వరకు ఉడికించి ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి 7. అదే పాన్లో మళ్లీ నూనె వేసి కాస్త వేడి అయ్యాక వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయలు వేసి వేగించాలి 8. తరువాత పచ్చిమిర్చి వేసి మరికాసేపు వేగనివ్వాలి 9. ఇప్పుడు వేగించి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు, చేపలు వేసి కలియబెట్టాలి 10. పసుపు, తగినంత ఉప్పు వేయాలి 11. కొద్దిగా నీళ్లు పోసి చిన్నమంటపై మూత పెట్టి పావుగంట పాటు ఉడికించాలి 12. కూర చిక్కబడిన తరువాత స్టవ్పై నుంచి దింపాలి 13. అన్నంలోకి లేదా చపాతీలోకి షిడోల్ చేప కూర చాలా రుచిగా ఉంటుంది.
6
['tel']
ఫిష్ కర్రీ ఎలా తయారు చేస్తారో క్లుప్తంగా ఇవ్వండి.
ఫిష్ కర్రీ కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. చేపలు - అరకేజీ 2. చింతపండు రసం - రెండు కప్పులు 3. ఉల్లిపాయ - ఒకటి 4. టొమాటోలు - రెండు 5. కొబ్బరి తురుము - మూడు టేబుల్స్పూన్లు 6. అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్స్పూన్ 7. పచ్చిమిర్చి - రెండు 8. పసుపు - ఒక టీస్పూన్ 9. కారం - రెండు టీస్పూన్లు 10. ఉప్పు - తగినంత 11. కరివేపాకు - కొద్దిగా. తయారీ: 1. చేప ముక్కలను శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి ఒక పాత్రలోకి తీసుకోవాలి 2. తరువాత ఆ పాత్రలో చింతపండు రసం పోసి కాసేపు పక్కన పెట్టుకోవాలి 3. తరిగిన ఉల్లిపాయలు, టొమాటో ముక్కలు వేయాలి 4. కొబ్బరి తురుము, పసుపు వేసి కలపాలి 5. పచ్చిమిర్చి వేయాలి 6. కొద్దిగా నీళ్లు పోయాలి 7. ఇప్పుడు ఆ పాత్రను స్టవ్పై పెట్టి ఉడికించాలి 8. మిశ్రమం వేడెక్కిన తరువాత పసుపు, కారం, తగినంత ఉప్పు వేయాలి 9. కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కలియబెట్టి ఉడికించాలి 10. చేప ముక్కలు ఉడికిన తరువాత దింపి వేడివేడిగా వడ్డించాలి.
1
['tel']
చికెన్ మసాలా కర్రీ ఎలా చేయాలి? సమాధానం లో కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఉండాలి.
చికెన్ మసాలా కర్రీ కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. చికెన్ - అరకేజీ 2. నిమ్మరసం - ఒక టేబుల్స్పూన్ 3. ఉల్లిపాయలు - రెండు 4. పచ్చిమిర్చి - మూడు 5. అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్ 6. వెనిగర్ - ఒక టీస్పూన్ 7. కారం - ఒక టీస్పూన్ 8. జీలకర్ర పొడి - రెండు టీస్పూన్లు 9. ధనియాల పొడి - ఒక టీస్పూన్ 10. గరంమసాలా - అర టీస్పూన్ 11. ఉప్పు - రుచికి తగినంత 12. పెరుగు - పావుకేజీ 13. సిమ్లామిర్చి పొడి - అర టీస్పూన్ 14. కొత్తిమీర - కొద్దిగా. తయారీ: 1. చికెన్ను శుభ్రంగా కడిగి ఒక పాత్రలోకి తీసుకోవాలి 2. తరువాత నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్టు, తరిగిన ఉల్లిపాయలు వేసి కలిపి ఒక గంట పాటు పక్కన పెట్టాలి 3. తరువాత మరొక పాత్రలో పెరుగు తీసుకుని అందులో పచ్చిమిర్చి, వెనిగర్, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరంమసాలా, సిమ్లా మిర్చి పొడి వేసి బాగా కలపాలి 4. ఇప్పుడు పెరుగు మిశ్రమాన్ని చికెన్ ముక్కలపై పోయాలి 5. స్టవ్పై పాన్ పెట్టి కాస్త వేడి అయ్యాక చికెన్ వేసి వేగించాలి 6. మసాలా ముక్కలకు బాగా పట్టుకునే వరకు వేగించుకోవాలి 7. తగినంత ఉప్పు వేయాలి 8. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి.
5
['tel']
మటన్ కీమా బాల్స్ ఎలా తయారు చేస్తాం?
మటన్ కీమా బాల్స్ కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. మటన్ కీమా - అరకేజీ 2. బిర్యానీ పువ్వు - కొద్దిగా 3. మిరియాలు - టీస్పూన్ 4. యాలకులు - నాలుగైదు 5. ధనియాలు - టేబుల్స్పూన్ 6. జీలకర్ర - టీస్పూన్ 7. దాల్చినచెక్క - కొద్దిగా 8. తోక మిరియాలు - అర టీస్పూన్ 9. లవంగాలు - ఐదారు 10. ఎండుమిర్చి - పది 11. నూనె - సరిపడా 12. ఉప్పు రుచికి తగినంత 13. బ్రౌన్ ఆనియన్స్ - అరకప్పు 14. కొత్తిమీర 15. పుదీనా - కొద్దిగా 16. సెనగపప్పు - టేబుల్స్పూన్ 17. అల్లంవెల్లుల్లి -  టేబుల్స్పూన్ 18. కోడిగుడ్డు - ఒకటి. తయారీ: 1. మటన్ కీమాను శుభ్రంగా కడగాలి 2. సెనగపప్పు నానబెట్టాలి 3. ముందుగా మసాలా సిద్ధం చేసుకోవాలి 4. స్టవ్పై పాన్ పెట్టి కాస్త వేడి అయ్యాక మిరియాలు, యాలకులు, ధనియాలు, జీలకర్ర, తోక మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ పువ్వు, ఎండుమిర్చి వేసి వేగించాలి 5. వీటితో పాటు బ్రౌన్ ఆనియన్స్ మిక్సీలో వేసి మసాలా పొడి తయారు చేసుకోవాలి 6. సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి, పుదీనా, కొత్తిమీర, నానబెట్టిన సెనగపప్పు వేయాలి 7. చివరగా కీమా వేసి, కోడిగుడ్డు కొట్టి వేయాలి 8. తగినంత ఉప్పు వేసి మరొకసారి మిక్సీ పట్టాలి 9. ఈ మిశ్రమాన్ని ప్లేటులోకి తీసుకుని మసాలాలు బాగా కలిసేలా కలపాలి 10. స్టవ్పై మరొక పాత్ర పెట్టి నూనె పోసి, ఈ మిశ్ర మాన్ని కొద్ది కొద్దిగా   బాల్స్లా చేసుకుంటూ నూనెలో డీప్ ఫ్రై చేస్తే మటన్ కీమా బాల్స్ రెడీ.
6
['tel']
చికెన్ రోస్ట్ ఎలా చేయాలి? సమాధానం లో కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఉండాలి.
చికెన్ రోస్ట్ కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. చికెన్ - ఒకకేజీ 2. ఉల్లిపాయలు - రెండు 3. ఎండుమిర్చి - పది 4. ధనియాలు - రెండు టేబుల్స్పూన్లు 5. వెల్లుల్లి రెబ్బలు - నాలుగైదు 6. జీలకర్ర - టీస్పూన్ 7. పసుపు - టీస్పూన్,  నూనె - సరిపడా 8. సాజీర - అర టీస్పూన్ 9. లవంగాలు - ఆరు 10. దాల్చిన చెక్క - కొద్దిగా 11. యాలకులు - నాలుగు 12. మిరియాలు - టీస్పూన్ 13. నెయ్యి - రెండు టేబుల్స్పూన్లు 14. కరివేపాకు - కొద్దిగా 15. కొత్తిమీర - ఒకకట్ట. తయారీ: 1. స్టవ్పై పాన్ పెట్టి నెయ్యి వేసి కాస్త వేడి అయ్యాక తరిగిన ఉల్లిపాయలు వేసి వేగించాలి 2. ఉల్లిపాయలు బాగా వేగాక పసుపు వేసి కలపాలి 3. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసి కలియబెట్టాలి 4. మూత పెట్టి చిన్నమంటపై ఉడికించాలి 5. మసాలా కోసం ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేగించాలి 6. అన్నీ వేగిన తరువాత మిరియాలు, సాజీర, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు వేయాలి 7. కాసేపయ్యాక అన్ని పదార్థాలను, వెల్లుల్లి రెబ్బలను మిక్సీలో వేసి పొడి చేయాలి 8. ఉడుకుతున్న చికెన్లో ఈ మసాలా వేయాలి 9. తగినంత ఉప్పు వేసి కలపాలి 10. నీళ్లు పోయకూడదు 11. మూత పెట్టి చిన్నమంటపై పదినిమిషాలపాటు ఉడికించాలి 12. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి 13. మంచి రంగు కోసం ఫుడ్ కలర్ వేసుకోవచ్చు 14. చివరగా కరివేపాకు, కొత్తిమీర వేసి మరి కాసేపు ఫ్రై చేసి దింపితే చికెన్ రోస్ట్ రెడీ 15. అన్నం లేదా రోటీతో చికెన్ రోస్ట్ రుచిగా ఉంటుంది.
5
['tel']
కొబ్బరిపాల చికెన్ ఎలా తయారు చేస్తారో క్లుప్తంగా ఇవ్వండి.
కొబ్బరిపాల చికెన్ కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసిన పదార్థాలు: 1. చికెన్ - అరకేజీ 2. కొబ్బరి పాలు - రెండు కప్పులు 3. అల్లం వెల్లుల్లి పేస్టు 4. గరం మసాల 5. జీరాపొడి 6. కారం - 1 స్పూను చొప్పున 7. మిరియాల పొడి - అర స్పూను 8. ఉప్పు - రుచికి సరిపడా 9. పసుపు - పావు స్పూను 10. పచ్చిమిర్చి - 3 11. కరివేపాకు - 8 రెబ్బలు 12. నూనె - పావు కప్పు 13. యాలకులు 14. లవంగాలు - 3 చొప్పున 15. దాల్చినచెక్క - అరంగుళం 16. ఉల్లి తరుగు - ఒక కప్పు 17. మిరియాల పొడి - అర స్పూను; మసాల పొడి కోసం: మిరియాలు - 10 18. దాల్చినచెక్క - అంగుళం 19. యాలకులు 20. లవంగాలు - 3 చొప్పున 21. బిర్యాని ఆకు - 1. తయారుచేసే విధానం: 1. చికెన్లో అల్లం వెల్లుల్లి, ఉప్పు, గరం మసాల, జీరా, పసుపు, ధనియా, కారం, మిరియాల పొడులు, పచ్చిమిర్చి తరుగు, ఒక టేబుల్ స్పూను నూనె, లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క, 4 రెబ్బల కరివేపాకు, పావుకప్పు కొబ్బరిపాలు వేసి బాగా కలిపి 6 గంటలు ఫ్రిజ్లో ఉంచాలి.  కడాయిలో నూనె వేసి మసాల పొడి, ఉల్లి తరుగు, కరివేపాకు వేగించి చికెన్ మిశ్రమం కలిపి మూతపెట్టాలి 2. ముక్క మెత్తబడి నూనె తేలాక మిగతా కొబ్బరిపాలు పోయాలి 3. కర్రీ చిక్కబడ్డాక కొత్తిమీర చల్లి దించేయాలి.
1
['tel']
సింపుల్ ఫిష్ కర్రీ రెసిపీ ఏంటి?
సింపుల్ ఫిష్ కర్రీ కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసిన పదార్థాలు: 1. చేప ముక్కలు - అరకేజీ 2. ఉల్లిపాయలు - 2 3. పచ్చిమిర్చి - 4 4. నూనె - 6 టేబుల్ స్పూన్లు 5. ఉప్పు - రుచికి సరిపడా 6. అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్ స్పూను 7. పసుపు - అర టీ స్పూను 8. టమోటా తరుగు - అరకప్పు 9. చింతపండు గుజ్జు - అరకప్పు 10. కారం 11. ధనియాల పొడి - 1 టేబుల్ స్పూను చొప్పున 12. నీరు - రెండు కప్పులు 13. కరివేపాకు - 4 రెబ్బలు 14. కొత్తిమీర - అరకప్పు; పొడికోసం : ధనియాలు - 1  స్పూను 15. వెల్లుల్లి రెబ్బలు - 8 16. మెంతులు - అర స్పూను 17. ఎండుమిర్చి - 6. తయారుచేసే విధానం: 1. మిక్సీలో ఉల్లి, పచ్చిమిర్చి పేస్టు చేసుకోవాలి 2. నూనెలో ఉల్లి పేస్టు వేగించి కరివేపాకు, ఉప్పు, అల్లం వెల్లుల్లి, పసుపు, టమోటా తరుగు, కారం, ధనియాల పొడి ఒకటి తర్వాత ఒకటి వేగించి చింతపండు గుజ్జు కలపాలి 3. తర్వాత నీరుపోసి మరుగుతున్నప్పుడు చేప ముక్కలు వేయాలి 4. పులుసు చిక్కబడ్డాక కొత్తిమీర చల్లి పూర్తిగా చల్లారిన తర్వాత సర్వ్ చేయాలి.
7
['tel']
ఎగ్ వడ ఎలా చేయాలి? సమాధానం లో కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఉండాలి.
ఎగ్ వడ కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. కోడిగుడ్లు - నాలుగు(ఉడికించినవి) 2. కార్న్ఫ్లోర్ - ఒక కప్పు 3. సెనగపిండి - రెండు కప్పులు 4. బియ్యప్పిండి - రెండు కప్పులు 5. ఉప్పు - రుచికి తగినంత 6. నూనె - సరిపడా,  వెల్లుల్లి రెబ్బలు - నాలుగు 7. పచ్చిమిర్చి - నాలుగైదు 8. ఉల్లిపాయలు - రెండు 9. అల్లం  - చిన్నముక్క 10. తోటకూర - ఒక కట్ట. తయారీ: 1. ఒకపాత్రలో కోడిగుడ్లను కొట్టి వేయాలి 2. తరువాత అందులో సెనగపిండి, బియ్యప్పిండి వేసి కలపాలి 3. తగినంత ఉప్పు, కారం వేయాలి 4. కార్న్ఫ్లోర్ వేసి కలపాలి 5. తరిగిన పచ్చిమిర్చి, చిదిమిన వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయలు వేయాలి 6. తోటకూరను చిన్నగా కట్ చేసి వేయాలి 7. అన్నీ బాగా కలిసేలా కలపాలి 8. ఇప్పుడు మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ వడల మాదిరిగా చేయాలి 9. పాన్పెట్టి నూనె పోసి వేడి అయ్యాక వాటిని వేసి గోధుమరంగులోకి మారే వరకు వేగించితే నోరూరించే ఎగ్ వడలు రెడీ.
5
['tel']
మొదటిసారి వంట చేసేవారికి చెప్పినట్టు నాకు ఎగ్రోల్ ఎలా చెయ్యాలొ చెప్పు
ఎగ్రోల్ కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. కోడిగుడ్లు - నాలుగు 2. కారం - ఒక టీస్పూన్ 3. క్యారెట్లు - రెండు 4. ఉప్పు - తగినంత 5. నూనె - కొద్దిగా 6. కొత్తిమీర - ఒకకట్ట 7. ఉల్లిపాయలు - రెండు. తయారీ: 1. ముందుగా ఒక బౌల్లో కోడిగుడ్లు కొట్టి వేయాలి 2. అందులో ఉప్పు, కారం, ఉల్లిపాయలు, క్యారెట్ తురుము, కొత్తిమీర వేసి బాగా కలపాలి 3. వెడల్పాటి పాన్ను స్టవ్పై పెట్టి కొద్దిగా నూనె రాసి కోడి గుడ్లను ఆమ్లెట్లా, కాస్త పలుచగా వేయాలి 4. ఆమ్లెట్ బాగా కాలిన తర్వాత ఒకవైపు నుంచి స్పూన్తో నెమ్మదిగా రోల్ చేయాలి 5. పాన్పై ఖాళీ అయిన ప్లేస్లో మళ్లీ ఆమ్లెట్ వేయాలి 6. ఆ ఆమ్లెట్ కూడా కాలాక, రోల్ చేసిన దీన్ని కూడా ఆమ్లెట్తో సహా మళ్లీ రోల్ చేయండి 7. గరిటెతో వత్తుకుంటూ రెండు వైపులా రోల్ను బాగా కాల్చాలి 8. తరువాత కత్తితో రోల్ను ముక్కలుగా కట్ చేసుకోవాలి 9. ఎగ్రోల్ను టొమాటో సాస్తో పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు.
4
['tel']
కోడిగుడ్డు పచ్చడి ఎలా చేయాలి? సమాధానం లో కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఉండాలి.
కోడిగుడ్డు పచ్చడి కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. కోడిగుడ్లు - మూడు(ఉడికించినవి) 2. గరంమసాలా - రెండు టేబుల్స్పూన్లు 3. మెంతి పొడి - ఒక టీస్పూన్ 4. ఆవ పొడి - ఒక టేబుల్స్పూన్ 5. అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూన్ 6. ఉప్పు - ఒక టేబుల్స్పూన్ 7. ఆవాల నూనె - మూడు టేబుల్స్పూన్లు 8. కరివేపాకు - కొద్దిగా 9. కారం - ఒక టేబుల్స్పూన్ 10. ఆవాలు - ఒక టీస్పూన్ 11. జీలకర్ర - ఒక టీస్పూన్ 12. నిమ్మకాయ - ఒకటి 13. కొత్తిమీర - కొద్దిగా. తయారీ: 1. ఉడికించిన గుడ్లను పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి 2. స్టవ్పై ఒక పాత్ర పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేగించాలి 3. తరువాత ఉడికించిన గుడ్లమీద కత్తితో గాట్లు పెట్టి అందులో వేయాలి 4. చిన్నమంటపై వేగించాలి 5. కోడిగుడ్లు గోధుమరంగులోకి మారే వరకు వేగించాలి 6. ఇప్పుడు అల్లంవెల్లుల్లి పేస్టు వేయాలి 7. గరంమసాలా, ఉప్పు, కారం వేసి మరి కాసేపు వేగనివ్వాలి 8. చివరగా కరివేపాకు వేసి దింపాలి 9. మిశ్రమం చల్లారిన తరువాత ఆవాల పొడి, మెంతి పొడి వేయాలి 10. కొత్తిమీర వేసుకోవాలి 11. నిమ్మరసం పిండుకొని కలపాలి 12. అంతే. 13. కోడిగుడ్డు పచ్చడి రెడీ 14. అన్నంలోకి, చపాతీలోకి ఈ పచ్చడి రుచిగా ఉంటుంది.
5
['tel']
మొదటిసారి వంట చేసేవారికి చెప్పినట్టు నాకు ఎగ్ ఫింగర్స్ ఎలా చెయ్యాలొ చెప్పు
ఎగ్ ఫింగర్స్ కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. కోడిగుడ్లు - ఎనిమిది 2. ఉప్పు - తగినంత 3. మిరియాల పొడి - అర టీస్పూన్ 4. కార్న్ఫ్లోర్ - పావు కప్పు 5. నూనె - సరిపడా 6. ఆల్ పర్పస్ ఫ్లోర్ - పావు కప్పు 7. చిల్లీ ఫ్లేక్స్ - అర టీస్పూన్ 8. బ్రెడ్ క్రంబ్స్ - రెండు టేబుల్స్పూన్లు తయారీ: 1. ముందుగా ఒక పాత్రలో కోడిగుడ్లు కొట్టి వేసుకోవాలి 2. తరువాత అందులో ఉప్పు, మిరియాలపొడి వేసి బాగా కలియబెట్టాలి 3. వెడల్పాటి పాన్ తీసుకుని నూనె రాసి అందులో కోడిగుడ్ల మిశ్రమం పోయాలి 4. ఒక వెడల్పాటి పాత్రలో కొద్దిగా నీళ్లు తీసుకుని స్టవ్పై పెట్టాలి 5. మధ్యలో చిన్న స్టాండ్లాంటిది పెట్టి దానిపై కోడిగుడ్ల మిశ్రమం పోసిన పాన్పెట్టి మూత పెట్టాలి 6. నీళ్లు పోసిన పాత్రపై కూడా మూత పెట్టాలి 7. చిన్నమంటపై అరగంట పాటు ఉడికించాలి 8. తరువాత నెమ్మదిగా బయటకు తీయాలి 9. ఊతప్పం మాదిరిగా అయిన వెంటనే దీన్ని వేరే ప్లేట్లోకి మార్చుకోవాలి 10. కత్తితో ఫింగర్స్ మాదిరిగా కట్ చేయాలి 11. మరొక పాత్రలో కార్న్ఫ్లోర్, ఆల్ పర్పస్ ఫ్లోర్, తగినంత ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్ వేసి కలపాలి 12. మరొక ప్లేట్లో కోడిగుడ్లు కొట్టి వేసి చిటికెడు ఉప్పు వేసి కలియబెట్టాలి 13. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఫింగర్స్ను పిండి మిశ్రమంలో అద్దుతూ, కోడిగుడ్డు సొనలో ముంచాలి 14. తరువాత బ్రెడ్ క్రంబ్స్ అద్దాలి 15. స్టవ్ ఒక పాన్ పెట్టి నూనె పోసి వేడి అయ్యాక బ్రెడ్ క్రంబ్స్ అద్దిన ఫింగర్స్ వేసి వేగించాలి 16. అంతే.. 17. ఎగ్ ఫింగర్స్ రెడీ.
4
['tel']
కబాబ్స్ ఎలా చేయాలి? సమాధానం లో కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఉండాలి.
కబాబ్స్ కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. కోడిగుడ్లు - మూడు(ఉడికించినవి) 2. బంగాళదుంపలు - రెండు 3. పచ్చిమిర్చి - రెండు 4. పసుపు - చిటికెడు 5. అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్ 6. సెనగపిండి - రెండు టేబుల్స్పూన్లు 7. కార్న్ఫ్లోర్ - రెండు టేబుల్స్పూన్లు 8. బ్రెడ్ క్రంబ్స్ - రెండు కప్పులు 9. మిరియాల పొడి - ఒక టీస్పూన్ 10. ఉప్పు - తగినంత 11. నూనె - సరిపడా. తయారీ: 1. బంగాళదుంపలను ఉడికించి గుజ్జులా చేసుకోవాలి 2. తరువాత దాంట్లో పచ్చిమిర్చి, పసుపు, తగినంత ఉప్పు, అల్లంవెల్లుల్లి పేస్టు, రెండు టేబుల్స్పూన్ల సెనగపిండి వేసి బాగా కలపాలి 3. ఇప్పుడు ఉడికించిన కోడిగుడ్లను పొడవు ముక్కలుగా కట్ చేయాలి 4. కోటింగ్ కోసం ఒక పాత్రలో బ్రెడ్ క్రంబ్స్ తీసుకోవాలి 5. అందులో కొద్దిగా మిరియాల పొడి, ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి 6. మరొక పాత్రలో రెండు టేబుల్స్పూన్ల కార్న్ఫ్లోర్ తీసుకోవాలి 7. అందులో కొద్దిగా నీళ్లు పోసి పలుచగా అయ్యేలా కలపాలి 8. ఇప్పుడు బంగాళదుంప మిశ్రమాన్ని కొద్దికొద్దిగా చేతుల్లోకి తీసుకుంటూ వెడల్పుగా గారెల్లా ఒత్తుకోవాలి 9. తరువాత మధ్యలో కోడిగుడ్డు ముక్క పెట్టి చుట్టూ ఆలూ మిశ్రమాన్ని దగ్గరకు ఒత్తి కబాబ్స్ మాదిరిగా చేయాలి 10. తరువాత వాటిని కార్న్ఫ్లోర్లో డిప్ చేసుకుంటూ, బ్రెడ్ క్రంబ్స్ని అద్దాలి 11. ఒక పాన్ను స్టవ్పై పెట్టి నూనె పోసి వేడి అయ్యాక వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి 12. అంతే. 13. ఎగ్ కబాబ్స్ రెడీ 14. వీటిని చట్నీతో సర్వ్ చేసుకుంటే రుచిగా ఉంటాయి.
5
['tel']
ఎగ్ 65 ఎలా తయారు చేస్తాం?
ఎగ్ 65 కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. కోడిగుడ్లు - రెండు(ఉడికించినవి) 2. ఉడకబెట్టని కోడిగుడ్డు - ఒకటి 3. పిండి - అర కప్పు 4. ఉప్పు - తగినంత 5. అల్లం - కొద్దిగా 6. వెల్లుల్లి రెబ్బలు - నాలుగైదు 7. పచ్చిమిర్చి - నాలుగు 8. నూనె - తగినంత 9. కారం - ఒక టేబుల్స్పూన్ 10. గరంమసాలా - ఒక టీస్పూన్ 11. బ్రెడ్ క్రంబ్స్ - కొద్దిగా 12. కరివేపాకు - ఒక కట్ట 13. కొత్తిమీర - ఒకకట్ట 14. పెరుగు - అరకప్పు 15. పంచదార - చిటికెడు 16. చిల్లీసాస్ - ఒక టేబుల్స్పూన్. తయారీ: 1. ముందుగా ఉడకబెట్టిన కోడిగుడ్లలోని తెలుపు భాగాన్ని చిన్నచిన్న ముక్కలుగా కట్ చేయాలి 2. వాటిని ఒక పాత్రలోకి తీసుకొని అందులో వెల్లుల్లి రెబ్బలు, కారం, తరిగిన అల్లం ముక్కలు, గరం మసాలా, కొద్దిగా బ్రెడ్ క్రంబ్స్, పిండి వేసి కలపాలి 3. ఇందులో ఒక కోడిగుడ్డు కొట్టి ఎగ్వైట్ మాత్రమే వేయాలి 4. కొద్దిగా ఉప్పు వేసి అన్నీ బాగా కలిసేలా కలియబెట్టాలి 5. స్టవ్పై ఒక పాత్రపెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక మిశ్రమాన్ని కొద్దికొద్దిగా చేతుల్లోకి తీసుకుంటూ నూనెలో వేయాలి 6. గోధుమరంగులోకి మారే వరకు వేగించి తీసుకోవాలి 7. ఇప్పుడు స్టవ్పై పాన్పెట్టి కాస్త నూనె వేసి తరిగిన అల్లం ముక్కలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేగించాలి 8. కాసేపు వేగిన తరువాత పెరుగు కొద్దిగా చిల్లీ సాస్ కూడా వేయాలి 9. కారం, గరంమసాలా వేసి కలపాలి 10. చిటికెడు పంచదార వేస్తే రుచి బాగుంటుంది 11. ఇప్పుడు కొత్తిమీర వేసి వేగించి పెట్టుకున్న ఎగ్ 65 వేసి కలియబెట్టాలి 12. కాసేపు వేగిన తరువాత కాస్త ఉప్పు చల్లి దింపాలి 13. క్రిస్పీగా రుచికరంగా ఉండే ఎగ్ 65ను పిల్లలు ఇష్టంగా తింటారు.
6
['tel']
నేతిలి పకోడీ ఎలా చేయాలి? సమాధానం లో కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఉండాలి.
నేతిలి పకోడీ కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. నేతిలి(నెత్తళ్లు) చేపలు - అరకేజీ 2. పచ్చిమిర్చి - ఐదారు 3. నూనె - వేగించడానికి సరిపడా 4. కొత్తిమీర - ఒక కట్ట 5. పుదీనా - ఒక కట్ట 6. కరివేపాకు - కొద్దిగా 7. జీలకర్రపొడి - అర టీస్పూన్ 8. ధనియాల పొడి - ఒక టీస్పూన్ 9. నిమ్మకాయలు - రెండు 10. మిరియాల పొడి - కొద్దిగా. తయారీ: 1. కొత్తిమీర, పుదీనా, కొన్ని పచ్చిమిర్చిని పేస్టులా చేసుకోవాలి 2. నేతిలి చేపలను శుభ్రం చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి 3. తరువాత అందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి పేస్టు వేయాలి 4. కరివేపాకు, అల్లంవెల్లుల్లి పేస్టు, పసుపు, తగినంత ఉప్పు, జీలకర్రపొడి, ధనియాల పొడి వేసి, నిమ్మరసం పిండి బాగా కలపాలి 5. ఇప్పుడు ఒక కప్పు సెనగపిండి, అరకప్పు బియ్యప్పిండి వేసి చేపలకు బాగా పట్టేలా కలపాలి 6. స్టవ్పై పాత్రపెట్టి నూనె పోసి బాగా వేడి అయ్యాక నేతిలి చేపల మిశ్రమాన్ని కొద్దికొద్దిగా చేతుల్లోకి తీసుకుంటూ నూనెలో వేగించాలి 7. మిరియాల పొడి వేసుకొని సర్వ్ చేసుకుంటే నేతిలి చేపల పకోడీ టేస్టీగా ఉంటుంది.
5
['tel']
నేను జెల్లల పులుసు చాలా రుచికరంగా ఉంటుంది అని విన్నాను. నాకు ఇది ఎలా చెయ్యాలో సంక్లిప్తంగా చెప్పు.
జెల్లల పులుసు కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. జెల్లలు - ఒకకేజీ 2. ఉల్లిపాయ - ఒకటి 3. పచ్చిమిర్చి - నాలుగు 4. చింతపండు రసం - ఒక కప్పు 5. అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్స్పూన్ 6. కారం - ఒక టీస్పూన్ 7. గరంమసాలా - ఒక టీస్పూన్ 8. మెంతిపొడి - అరటీస్పూన్ 9. పసుపు - పావు టీస్పూన్ 10. జీలకర్ర - అరటీస్పూన్ 11. ఉప్పు - తగినంత 12. ఎండుమిర్చి - రెండు 13. కొత్తిమీర - కొద్దిగా. కొబ్బరి తురుము - ఒక టేబుల్స్పూన్,  టొమాటో ప్యూరీ - ఒక కప్పు. తయారీ: 1. ఉల్లిపాయను మంటపై పెట్టి కాసేపు ఉడికించి, తరువాత మెత్తగా పేస్టు చేయాలి 2. పాన్లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఎండుమిర్చి, జీలకర్ర, అల్లంవెల్లుల్లి పేస్టు వేసి వేగించాలి 3. పచ్చిమిర్చి, ఉల్లిపాయ పేస్టు, పసుపు వేసి మరికాసేపు వేగించాలి 4. తరువాత టొమాటో ప్యూరీ వేసి ఐదు నిమిషాల పాటు ఉడికించాలి 5. ఇప్పుడు చింతపండు రసం పోయాలి 6. తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి 7. కారం, గరంమసాలా, మెంతిపొడి, కొబ్బరి తురుము, తగినంత ఉప్పు వేయాలి 8. మిశ్రమం ఉడుకుతున్న సమయంలో శుభ్రం చేసి పెట్టుకున్న జెల్లలు వేయాలి 9. మరో పదినిమిషాల పాటు ఉడికించాలి 10. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి.
3
['tel']
వంజరం వేపుడు ఎలా తయారు చేస్తాం?
వంజరం వేపుడు కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. వంజరం చేప - పావు కేజీ 2. కరివేపాకు - కొద్దిగా 3. నూనె - సరిపడా 4. అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్ 5. పసుపు - అర టీస్పూన్ 6. ఉప్పు - తగినంత 7. నిమ్మకాయ - ఒకటి 8. కారం - అర టీస్పూన్ 9. గరంమసాలా - అర టీస్పూన్. తయారీ: 1. ముందుగా చేపను శుభ్రం చేసుకోవాలి 2. ఒక బౌల్లో అల్లంవెల్లుల్లి పేస్టు, పసుపు, గరంమసాలా, కారం, తగినంత ఉప్పు వేసి కలపాలి 3. ఈ మిశ్రమాన్ని చేప ముక్కలకు పట్టించాలి 4. స్టవ్పై పాన్ పెట్టి నూనె వేసి కరివేపాకు వేసి వేగించాలి 5. తరువాత మసాలా పట్టించిన చేప ముక్కలు వేసి చిన్నమంటపై కాసేపు వేగనివ్వాలి 6. కాసేపయ్యాక నెమ్మదిగా చేప ముక్కలు మరో వైపు తిప్పి మరికాసేపు ఫ్రై కానివ్వాలి 7. చేప ముక్కలు రెండు వైపులా బాగా ఫ్రై అయ్యాక నిమ్మరసం పిండుకొని దించాలి 8. వంజరం వేపుడు చపాతీలోకి లేదా అన్నంలోకి రుచిగా ఉంటుంది.
6
['tel']
మ్యాంగో క్రంబ్ బార్స్ రెసిపీ ఏంటి?
మ్యాంగో క్రంబ్ బార్స్ కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. మామిడిపండ్లు - మూడు 2. పంచదార - ఐదు టేబుల్స్పూన్లు 3. మొక్కజొన్న పిండి - అర టేబుల్స్పూన్లు 4. పిండి - రెండు కప్పులు 5. బేకింగ్ పౌడర్ - అర టీస్పూన్ 6. ఉప్పు - పావు టీస్పూన్ 7. వెన్న - ముప్పావు కప్పు 8. కోడిగుడ్డు - ఒకటి 9. వెనీలా ఎక్స్ట్రాక్ట్ - అర టీస్పూన్. తయారీ: 1. ముందుగా ఓవెన్ను 350 డిగ్రీల ఫారన్హీట్ ఉష్ణోగ్రతకు వేడి చేయాలి 2. మామిడిపండును ముక్కలుగా కట్ చేసి ఒక పాత్రలోకి తీసుకోవాలి 3. తరువాత అందులో మొక్కజొన్నపిండి, పంచదార వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి 4. మరొక పాత్రలో పిండి, బేకింగ్పౌడర్, తగినంత ఉప్పు తీసుకోవాలి 5. వెన్నను ముక్కలుగా కట్ చేసి పిండిలో వేసి కలపాలి 6. ఇప్పుడు కోడిగుడ్డు, వెనీలా ఎక్స్ట్రాక్ట్ వేయాలి 7. బాగా కలియబెట్టాలి 8. మిశ్రమం పొడిపొడిగా తయారవుతుంది 9. ఈ మిశ్రమాన్ని బేకింగ్ పాన్పై ఒక లేయర్లా వేసుకోవాలి 10. దానిపై మామిడిపండు మిశ్రమాన్ని అంతటా సమంగా పడేలా పోయాలి 11. పైన కొద్దిగా పొడి పిండి మిశ్రమాన్ని చల్లాలి 12. ఓవెన్లో 40 నిమిషాల పాటు బేక్ చేయాలి 13. తరువాత ఓవెన్లో నుంచి తీయాలి 14. చల్లారిన తరువాత ముక్కలుగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి.
7
['tel']
డ్రైఫ్రూట్స్ కజ్జికాయలు ఎలా చేయాలి? సమాధానం లో కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఉండాలి.
డ్రైఫ్రూట్స్ కజ్జికాయలు కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసిన పదార్థాలు: 1. గోధుమపిండి - నాలుగు కప్పులు 2. నీరు - పావు కప్పు 3. ఉప్పు - అర స్పూను 4. నెయ్యి - ఒక స్పూను 5. పంచదార - నాలుగు స్పూన్లు 6. యాలకుల - 3 7. డ్రైఫ్రూట్స్ పొడులు- మూడు స్పూన్లు. తయారుచేసే విధానం: 1. గోధుమపిండిలో తగినంత నీరు, ఉప్పు, నెయ్యి వేసి మెత్తని ముద్దగా తయారుచేసి పక్కనుంచాలి 2. ఒక పాత్రలో పంచదార, యాలకుల, డ్రైఫ్రూట్స్ పొడులు వేసి బాగా కలపాలి 3. ఇప్పుడు గోధుమ పిండిని పూరీలుగా చేసుకుని మధ్యలో కొంత డ్రైఫ్రూట్ మిశ్రమం పెట్టి సగానికి మడిచి అంచుల్ని ఒత్తుకోవాలి 4. అన్నీ తయారయ్యాక నూనెలో దోరగా వేగించి, చల్లారిన తర్వాత డబ్బాలో భద్రపరచుకోవాలి 5. పిల్లలు ఇష్టంగా తినే ఈ కజ్జికాయలు రుచితో పాటు శక్తిని కూడా ఇస్తాయి.
5
['tel']
కాజూ బర్ఫీ ఎలా చేయాలి? సమాధానం లో కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఉండాలి.
కాజూ బర్ఫీ కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసిన పదార్థాలు: 1. జీడిపప్పు- ఒక కప్పు 2. పంచదార- సగం కప్పు 3. నీళ్లు- అయిదు స్పూన్లు 4. నెయ్యి- ఒక స్పూను. తయారుచేసే విధానం: 1. ముందుగా మిక్సీలో జీడిపప్పు వేసి మెత్తటి పొడిలా చేసుకోవాలి 2. పేస్టుగా కానీ జారుగా కానీ ఉండకుండా జాగ్రత్తపడాలి 3. ఓ మందపాటి కడాయిలో పంచదార, నీళ్లు వేసి వేడిచేయాలి 4. పంచదార కరగగానే జీడిపప్పు పొడి వేసి కలుపుతూ ఉండాలి 5. చిక్కబడ్డాక నెయ్యి కూడా వేసి కలపాలి 6. మొత్తం కలిసిపోయి దగ్గరవుతుంది 7. నెయ్యి పూసిన ఓ ప్లేట్లో మిశ్రమాన్ని వెయ్యాలి 8. దాని మీద ఓ బటర్ పేపర్ పెట్టి పూరీలా వత్తాలి 9. కాస్త చల్లారిన తరవాత చాకుతో ముక్కలుగా కోస్తే బర్ఫీ రెడీ.
5
['tel']
మొదటిసారి వంట చేసేవారికి చెప్పినట్టు నాకు వాలంటైన్ స్మూతీ ఎలా చెయ్యాలొ చెప్పు
వాలంటైన్ స్మూతీ కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. సోయా మిల్క్ - రెండు కప్పులు(చల్లగా ఉండాలి) 2. రాస్బెర్రీలు - ఒక కప్పు 3. అంజీర్ - రెండు 4. జీడిపప్పు - అరకప్పు 5. కొకొవా పౌడర్ - రెండు టేబుల్స్పూన్లు 6. మాకా పౌడర్ - ఒక టీస్పూన్ 7. తియ్యటి మిరపపొడి - అర టీస్పూన్ 8. మాపుల్ సిరప్ - ఒక టేబుల్స్పూన్. తయారీ విధానం: 1. మిక్సీలో పదార్థాలన్నింటినీ వేసి బ్లెండ్ చేసుకోవాలి 2. కొకొవా పౌడర్తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి.
4
['tel']
తీపి పొంగలి ఎలా చేయాలి? సమాధానం లో కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఉండాలి.
తీపి పొంగలి కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసిన పదార్థాలు: 1. బియ్యం - అరకప్పు 2. పెసరపప్పు - అరకప్పు 3. జీడిపప్పు - 10 4. కిస్మిస్ - 10 5. యాలకులు - 10 6. బెల్లం - ఒక కప్పు 7. నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు. తయారీ విధానం: 1. ముందుగా బియ్యం, పెసరపప్పుని శుభ్రంగా కడిగి నీరుపోసి అరగంట పక్కనుంచాలి 2. నెయ్యిలో కిస్మిస్, జీడిపప్పులు వేగించి పక్కనుంచాలి 3. కడాయిలో బెల్లం వేసి ఒక కప్పు నీరు పోసి మరిగించాలి 4. మరిగిన తర్వాత వడకట్టి బెల్లం నీటిని పక్కనుంచాలి 5. కుక్కర్లో బియ్యం, పప్పు వేసి 2 కప్పుల నీరు, 3 యాలకులు వేసి 4 విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి 6. చల్లారాక గరిటతో బాగా మెదిపి, బెల్లం నీరు కలపాలి 7. ఈ మిశ్రమాన్ని మరో పది నిమిషాలు చిక్కబడేవరకు ఉడికించాలి 8. చివరలో కొద్దిగా నెయ్యి వేసి కిస్మిస్, జీడిపప్పు, యాలకుల పొడి కలిపి రెండు నిమిషాల తర్వాత దించేయాలి.
5
['tel']
మొదటిసారి వంట చేసేవారికి చెప్పినట్టు నాకు గుమ్మడి బొబ్బట్లు ఎలా చెయ్యాలొ చెప్పు
గుమ్మడి బొబ్బట్లు కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసిన పదార్థాలు: 1. గుమ్మడికాయ తురుము - 3 కప్పులు 2. బెల్లం పొడి - ఒకటిన్నర కప్పులు 3. మైదా - ముప్పావు కప్పు 4. యాలకుల పొడి - ఒక టీ స్పూను 5. నెయ్యి - తగినంత. తయారీ విధానం: 1. దళసరి అడుగున్న కడాయిలో టేబుల్ స్పూను నెయ్యి వేసి గుమ్మడి తురుముని వేగించాలి 2. తర్వాత బెల్లం తురుము వేసి మిశ్రమాన్ని చిన్నమంటపై చిక్కబడనివ్వాలి 3. ఇప్పుడు యాలకుల పొడి కలిపి దించేయాలి 4. చల్లారిన తర్వాత నిమ్మకాయ సైజు ఉండలుగా చేసుకుని పక్కనుంచాలి 5. మరో పాత్రలో మైదా, స్పూను నెయ్యి వేసి నీళ్లు కలుపుతూ చపాతి పిండిలా ముద్దగా చేసుకొని గంటపాటు పక్కనుంచాలి 6. తర్వాత కొంతకొంత పిండి తీసుకుని అరచేతిలో ఒత్తి గుంతలా చేసి గుమ్మడి మిశ్రమం పెట్టి మూసి, బొబ్బట్లు ఒత్తుకోవాలి 7. తర్వాత పెనంపై వేసి రెండువైపులా నెయ్యితో దోరగా కాల్చుకోవాలి 8. వీటిని వేడిమీద ఉండగానే తింటే చాలా రుచిగా ఉంటాయి.
4
['tel']
కొబ్బరి బూరెలు ఎలా తయారు చేస్తాం?
కొబ్బరి బూరెలు కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. బియ్యప్పిండి - కేజీ 2. బెల్లం - ముప్పావు కేజీ 3. కొబ్బరి ముక్కలు - రెండు 4. డాల్డా - 100గ్రాములు 5. నూనె - డీప్ ఫ్రైకి సరిపడా. తయారీ విధానం: 1. బియ్యాన్ని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే గ్రైండ్ చేయాలి.కొబ్బరి ముక్కలు, బెల్లంను విడిగా గ్రైండర్ వేసి పొడి చేసుకోవాలి.వెడల్పాటి పాన్లో బెల్లంను వేడి చేయాలి 2. బెల్లం త్వరగా కరగడానికి కొద్దిగా నీళ్లు పోయాలి 3. బెల్లం పానకం వేళ్లకు అంటుకున్నట్లుగా ఉండేలా చూసుకోవాలి.ఇప్పుడు ఈ పానకంలో కొబ్బరి పొడి యాలకుల పొడి, డాల్డా వేసి కలియబెట్టాలి.ఇప్పుడు బియ్యప్పిండి వేసి కలపాలి.తరువాత పిండిని చిన్నచిన్న బూరెల మాదిరిగా ఒత్తుకోవాలి.పాన్లో నూనె పోసి బూరెల్ని గోధుమ రంగులోకి మారే వరకు వేగించాలి.
6
['tel']
మొదటిసారి వంట చేసేవారికి చెప్పినట్టు నాకు గోరుమీటీలు ఎలా చెయ్యాలొ చెప్పు
గోరుమీటీలు కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. మైదా - పావుకేజీ 2. బొంబాయి రవ్వ - మూడు టేబుల్స్పూన్లు 3. వెన్న - రెండు టేబుల్స్పూన్లు 4. పంచదార - 200 గ్రాములు 5. బెల్లం - రెండు టేబుల్స్పూన్లు 6. యాలకులు - రెండు 7. నూనె - డీప్ ఫ్రైకి సరిపడా 8. నెయ్యి - ఒక టేబుల్స్పూన్ 9. ఉప్పు - కొద్దిగా. తయారీ విధానం: 1. ఒక పాత్రలో మైదా పిండి తీసుకొని అందులో వెన్న, కొద్దిగా ఉప్పు వేసి, తగినన్ని నీళ్లు పోసి కలపాలి.మిశ్రమం మెత్తగా రావాలంటే కొద్దిగా నూనె వేయాలి 2. తరువాత రవ్వ కలిపి అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి.పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ బొటనవేలుపై గోరుమీటీలు చేసుకోవాలి.పాన్లో నూనె పోసి కాస్త వేడి అయ్యాక గోరుమీటీలను వేసి వేగించాలి.మరొక పాత్రలో అర కప్పు నీళ్లు పోసి పంచదార, బెల్లం పానకం తయారుచేయాలి 3. అందులో యాలకుల పొడి, నెయ్యి వేయాలి.ఇప్పుడు వేగించి పెట్టుకున్న గోరుమీటీలను పానకంలో వేయాలి 4. వీటిని పిల్లలు ఇష్టంగా తింటారు.
4
['tel']
మొదటిసారి వంట చేసేవారికి చెప్పినట్టు నాకు పనియారం (పొంగణాలు) ఎలా చెయ్యాలొ చెప్పు
పనియారం (పొంగణాలు) కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. ఇడ్లీ పిండి - రెండు కప్పులు 2. ఉల్లిపాయ - ఒకటి 3. పచ్చిమిర్చి - రెండు 4. అల్లం ముక్క - కొద్దిగా 5. ఇంగువ - చిటికెడు 6. మిరియాలపొడి - పావు టీస్పూన్ 7. కారం - పావు టీస్పూన్ 8. కరివేపాకు - కొద్దిగా 9. కొబ్బరి తురుము - అర కప్పు 10. ఉప్పు - తగినంత. తయారీ విధానం: 1. ఒక పాత్రలో ఇడ్లీ పిండి తీసుకొని అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొబ్బరి తురుము, దంచిన అల్లం ముక్క, ఇంగువ, మిరియాల పొడి, కారం, కరివేపాకు, కొద్దిగా ఉప్పు వేసి కలియబెట్టాలి.పొంగణాల పాత్రను స్టవ్పై పెట్టి కొద్దిగా నూనె వేయాలి 2. స్పూన్తో పిండిని పొంగణాల గుంతల్లో వేయాలి.చిన్నమంటపై రెండు మూడు నిమిషాలు ఉడికించి స్పూన్ సహాయంతో పొంగణాలను తిప్పి మరికాసేపు ఉడికించి దింపుకోవాలి.కొబ్బరి చట్నీ లేదా సాంబరుతో తింటే రుచిగా ఉంటాయి.
4
['tel']
నువ్వుల అరిసెలు రెసిపీ ఏంటి?
నువ్వుల అరిసెలు కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. బియ్యం - ఒక కేజీ 2. బెల్లం - అర కేజీ 3. యాలకుల పొడి - ఒక టీస్పూన్ 4. నువ్వులు - 50 గ్రాములు 5. నూనె - డీప్ ఫ్రైకి సరిపడా 6. అరిసెల చెక్కలు. తయారీ విధానం: 1. ముందుగా బియ్యంను ఒక రోజంతా నానబెట్టాలి 2. తరువాత వాటిని మెత్తటి పిండిలా పట్టుకోవాలి 3. ఒక పాన్ తీసుకొని స్టవ్పై పెట్టి బెల్లం వేసి, ఒక కప్పు నీళ్లు పోసి చిన్నమంటపై మరిగించాలి 4. బెల్లం కరిగి పానకం తయారయ్యాక నువ్వులు వేయాలి 5. యాలకుల పొడి, నెయ్యి వేసి కలుపుకోవాలి 6. స్టవ్ ఆర్పేసి బియ్యం పిండిని వేసి గడ్డలు లేకుండా కలుపుకోవాలి 7. మరీ మెత్తగా కాకుండా చూసుకోవాలి 8. చేతులకు కొద్దిగా నూనె రాసుకుంటూ పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని అరిసెలుగా ఒత్తుకోవాలి 9. వెడల్పాటి పాన్ స్టవ్పై పెట్టి నూనె పోసి వేడి అయ్యాక అరిసెలు వేసి వేగించాలి 10. రెండు వైపులా సమంగా వేగేలా చూసుకోవాలి 11. అరిసెలకు నూనె ఎక్కువగా ఉంటే కనుక చెక్కలతో ఒత్తుకోవాలి.
7
['tel']
సీతాఫల్ మిల్క్షేక్ ఎలా తయారు చేస్తాం?
సీతాఫల్ మిల్క్షేక్ కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసిన పదార్థాలు: 1. సీతాఫలం గుజ్జు - ఒక కప్పు 2. పాలు - ఒకకప్పు 3. పంచదార - రెండు టేబుల్స్పూన్లు 4. వెనీలా ఐస్క్రీమ్ - ఒక స్కూప్ 5. ఐస్క్యూబ్లు - కొన్ని 6. నట్స్ - గార్నిష్ కోసం. తయారీ విధానం: 1. మిక్సీ జార్లో సీతాఫలం గుజ్జు, పాలు, పంచదార వేసి గ్రైండ్ చేయాలి 2. మిశ్రమం స్మూత్గా అయ్యే వరకు మిక్సీ పట్టాలి 3. నోరూరించే మిల్క్షేక్ రెడీ 4. నట్స్తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి 5. చల్లగా తాగాలనుకునే వారు కాసేపు ఫ్రిజ్లో పెట్టుకుని లేదా ఐస్ క్యూబ్స్ వేసుకుని తీసుకోవచ్చు.
6
['tel']
మొదటిసారి వంట చేసేవారికి చెప్పినట్టు నాకు సీతాఫలం కలాకంద్ ఎలా చెయ్యాలొ చెప్పు
సీతాఫలం కలాకంద్ కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసిన పదార్థాలు: 1. పాలు - రెండు లీటర్లు 2. నిమ్మరసం - రెండు టీస్పూన్లు 3. పంచదార - రెండు టీస్పూన్లు 4. యాలకుల పొడి - రెండు టేబుల్స్పూన్లు 5. సీతాఫలం గుజ్జు - పావు కప్పు 6. నెయ్యి - ఒకకప్పు 7. పిస్తా - అరకప్పు 8. బాదం - ఐదారు పలుకులు. సిల్వర్ ఫాయిల్ - కొద్దిగా. తయారీ విధానం: 1. రెండు పాన్లలో పాలను సమానంగా తీసుకోవాలి 2. ఒక పాన్లోని పాలు సగానికి వచ్చే వరకు మరిగించి పక్కన పెట్టుకోవాలి 3. తరువాత మరో పాన్లో ఉన్న పాలను మరిగించాలి 4. పాలు మరుగుతున్న సమయంలో నిమ్మరసం వేయాలి 5. దాంతో పాలు విరిగిపోతాయి 6. ఇప్పుడు స్టవ్ ఆర్పేసి ఒక కాటన్ వస్త్రం సహాయంతో పాలు వడబోస్తే పన్నీర్ మిగులుతుంది 7. ఈ పన్నీర్ను బాగా మరిగించి పెట్టుకున్న పాలలో కలపాలి 8. మళ్లీ స్టవ్పై పెట్టి చిన్నమంటపై కొద్దిసేపు ఉంచాలి 9. కాసేపయ్యాక పంచదార, యాలకుల పొడి, సీతాఫలం గుజ్జు వేసి బాగా కలపాలి 10. ఒక ప్లేట్ అడుగున నెయ్యి పూసి అందులో ఈ మిశ్రమం పోయాలి 11. ప్లేట్ అంతటా సమంగా వచ్చేలా చూసుకోవాలి 12. పిస్తా, సిల్వర్ ఫాయిల్తో గార్నిష్ చేసుకోవాలి 13. తరువాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని సర్వ్ చేసుకొని తింటే టేస్టీగా ఉంటుంది.
4
['tel']
బెల్లం అరిసెలు ఎలా చేయాలి? సమాధానం లో కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఉండాలి.
బెల్లం అరిసెలు కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. బియ్యం - ఒకకప్పు 2. బెల్లం - ఒకకప్పు 3. యాలకులు - నాలుగు 4. నెయ్యి - ఒక టీస్పూన్ 5. నూనె - డీప్ ఫ్రైకి తగినంత. తయారీవిధానం: 1. బియ్యం శుభ్రంగా కడిగి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి 2. తరువాత నీళ్లు తీసేసి పలుచటి వస్త్రంలో పోసి ఆరబెట్టుకోవాలి 3. బియ్యం కొంచెం తడిగా ఉన్నప్పుడే మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి 4. యాలకులను మిక్సీ పట్టుకోవాలి 5. ఇప్పుడు ఒక పాత్రలో కొన్ని నీళ్లు పోసి బెల్లం వేసి ఉడికించాలి 6. నీళ్లలో పానకం చుక్క వేస్తే కరిగిపోకుండా ఉన్నప్పుడు సరిగ్గా ఉడికినట్టుగా భావించాలి 7. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ పానకాన్ని గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిలో నెమ్మదిగా కలుపుకోవాలి 8. ఇప్పుడ మిశ్రమం మరింత చిక్కగా తయారవుతుంది 9. ఈ మిశ్రమాన్ని ఉండలుగా చేసుకోవాలి 10. గారెల మాదిరిగా చేసుకుంటూ నూనెలో వేసి వేగించాలి 11. అంతే, నోరూరించే బెల్లం అరిసెలు రెడీ.
5
['tel']
నేను స్వీట్ సీడాయి చాలా రుచికరంగా ఉంటుంది అని విన్నాను. నాకు ఇది ఎలా చెయ్యాలో సంక్లిప్తంగా చెప్పు.
స్వీట్ సీడాయి కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. బియ్యప్పిండి - ఒక కప్పు 2. మినప్పిండి - రెండు టేబుల్స్పూన్లు 3. బెల్లం - అరకప్పు 4. నీళ్లు - పావు కప్పు 5. వెన్న - ఒక టేబుల్స్పూన్ 6. కొబ్బరిపొడి - ఒక టేబుల్స్పూన్ 7. నువ్వులు - ఒక టీస్పూన్ 8. నూనె - డీప్ ఫ్రైకి తగినంత 9. యాలకుల పొడి - చిటికెడు. తయారీవిధానం: 1. గోరు వెచ్చని నీటిలో బెల్లం వేసి నానబెట్టాలి 2. తరువాత కాస్త వేడి చేసి మిశ్రమం చిక్కగా అయ్యేలా చేసి పక్కన పెట్టాలి 3. పాన్ తీసుకొని బియ్యప్పిండి, మినప్పిండిని వేగించాలి 4. రంగు మారే వరకు కాకుండా కొద్దిసేపు వేగించుకుని పక్కన పెట్టాలి 5. తరువాత కొబ్బరిపొడి వేగించాలి 6. ఇప్పుడు ఒకపాత్రలో బియ్యప్పిండి, మినప్పిండి, కొబ్బరిపొడి, వెన్న, నువ్వులు, యాలకులపొడి వేసి కలుపుకోవాలి 7. తరువాత బెల్లం పానకం వేసి కలియబెట్టుకోవాలి 8. మెత్తగా కావాలనుకుంటే కొన్ని నీళ్లు కలుపుకోవచ్చు 9. అయితే మిశ్రమం బాగా పలుచగా కాకుండా చూసుకోవాలి 10. ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి 11. ఒకపాత్రలో నూనె వేసి వేడి అయ్యాక వాటిని వేసి వేగించాలి 12. ముదురుగోధుమ రంగు వచ్చే వరకు వేగించుకోవాలి 13. అంతే, రుచిగా ఉండే స్వీట్ సీడాయి రెడీ.
3
['tel']
నేతి అప్పం ఎలా తయారు చేస్తాం?
నేతి అప్పం కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. బియ్యం - ఒకకప్పు 2. కందిపప్పు - ఒకటీస్పూన్ 3. బెల్లం - ఒకకప్పు 4. అరటిపండు - ఒకటి 5. యాలకులు - నాలుగు 6. నెయ్యి - తగినంత 7. కొబ్బరిపొడి - రెండు టేబుల్స్పూన్లు. తయారీవిధానం: 1. బియ్యం, కందిపప్పును శుభ్రంగా కడిగి ఒకగంటసేపు నానబెట్టాలి 2. తరువాత నీళ్లు పూర్తిగా తీసివేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి 3. మెత్తగా అయ్యాక బెల్లం వేసి మరోసారి గ్రైండ్ చేయాలి 4. ఇప్పుడు మిశ్రమం పలుచగా మారుతుంది 5. ఇప్పుడు అరటిపండును గుజ్జుగా చేసి వేయాలి 6. యాలకులు వేయాలి 7. కొబ్బరిపొడి వేసి మరోసారి గ్రైండ్ చేయాలి 8. పొంగణాల పాన్ తీసుకొని నెయ్యి రాసుకోవాలి 9. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని పాన్ గుంటల్లో వేయాలి 10. కాసేపు వేగాక అప్పంలను తిప్పుకోవాలి 11. గోధుమరంగులోకి వచ్చే వరకు వేగించి సర్వ్ చేసుకోవాలి.
6
['tel']
మొదటిసారి వంట చేసేవారికి చెప్పినట్టు నాకు పాలకోవా ఎలా చెయ్యాలొ చెప్పు
పాలకోవా కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. మీగడ తీయని పాలు - ఒకటిన్నర లీటరు 2. పంచదార - నాలుగు టేబుల్స్పూన్లు 3. నెయ్యి - రెండు టేబుల్స్పూన్లు 4. కుంకుమపువ్వు - కొద్దిగా 5. యాలకులపొడి - చిటికెడు. తయారీవిధానం: 1. ఒక మందపాటి పాన్ తీసుకొని పాలు పోసి చిన్నమంటపై మరిగించాలి 2. పాలు మరుగుతున్న సమయంలో మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి 3. మరుగుతున్న సమయంలోనే కుంకుమపువ్వు వేయాలి 4. పాలు మరిగి చిక్కబడుతున్న సమయంలో రంగు మారుతాయి 5. పాలు కాస్త చిక్కబడిన తరువాత యాలకులపొడి, పంచదార, నెయ్యి వేసి కలియబెట్టాలి 6. పంచదార వేసిన తరువాత మిశ్రమం కాస్త పలుచబడుతుంది 7. మరికాసేపు చిన్నమంటపై ఉంచితే చిక్కటి మిశ్రమంగా మారుతుంది 8. ఇప్పుడు స్టవ్ ఆపేసి మరో పాత్రలోకి మార్చుకుని సర్వ్ చేసుకోవాలి.
4
['tel']
మీరు మింట్ లస్సీ తయారు చెయ్యడానికి ఎటువంటి తిండి పదార్ధాలు వాడుతురు మరియు ఏ విధముగా చేస్తారో వివరణ ఇవ్వండి.
మింట్ లస్సీ కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. పెరుగు - 300ఎం.ఎల్ 2. పంచదార - రెండు టేబుల్స్పూన్లు 3. ఎండు పుదీనా - ఒక టేబుల్స్పూన్ 4. జీలకర్ర - ఒక టీస్పూన్ 5. ఐస్ ముక్కలు - కొన్ని 6. పుదీనా - కొద్దిగా(గార్నిష్ కోసం). తయారీవిధానం: 1. ముందుగా జీలకర్రను వేయించుకోవాలి 2. ఒక పాత్రలో పెరుగు తీసుకొని పంచదార, ఎండు పుదీనా వేసి బాగా కలియబెట్టాలి 3. ఐస్ ముక్కలు వేసుకోవాలి 4. జీలకర్ర, పుదీనా ఆకులతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేయాలి.
2
['tel']
స్ట్రాబెర్రీ కార్న్ సల్సా ఎలా తయారు చేస్తారో క్లుప్తంగా ఇవ్వండి.
స్ట్రాబెర్రీ కార్న్ సల్సా కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. తాజా స్ట్రాబెర్రీలు- రెండు కప్పులు 2. చిన్న టొమాటోలు- రెండు కప్పులు 3. ఫ్రిజ్లో ఉంచిన మొక్కజొన్న గింజలు (కార్న్)- కప్పు 4. కొత్తిమీర- మూడు టేబుల్ స్పూన్లు. ఆలివ్ నూనె- పావు కప్పు 5. వెనిగర్- రెండు టేబుల్ స్పూన్లు 6. నిమ్మరసం- రెండు టేబుల్స్పూన్లు 7. ఉప్పు- అర టీస్పూను. తయారీ: 1. పెద్ద గిన్నెలో స్ట్రాబెర్రీ, టొమాటో ముక్కలు, మొక్కజొన్న గింజలు, తరిగిపెట్టుకున్న కొత్తిమీర తీసుకోవాలి 2. చిన్న పాత్ర తీసుకొని అందులో ఆలివ్ నూనె, వెనిగర్, నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలపాలి 3. ఈ మిశ్రమాన్ని స్ట్రాబెర్రీ ముక్కలున్న పాత్రలో వేసి, మిక్స్ చేసి, గంటసేపు ఫ్రిజ్లో ఉంచితే నోరూరించే స్ట్రాబెర్రీ కార్న్ సల్సా రెడీ అవుతుంది 4. దీన్ని చిప్స్తో అలంకరించి చల్లచల్లగా అందించాలి.
1
['tel']
మీరు స్వీట్కార్న్ సలాడ్ తయారు చెయ్యడానికి ఎటువంటి తిండి పదార్ధాలు వాడుతురు మరియు ఏ విధముగా చేస్తారో వివరణ ఇవ్వండి.
స్వీట్కార్న్ సలాడ్ కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. స్వీట్ కార్న్ గింజలు- ఒకటిన్నర కప్పు 2. ఉల్లిపాయ 3. టొమాటో (కొంచెం పెద్దది) 4. కొత్తిమీర 5. నిమ్మకాయ 6. దానిమ్మ గింజలు- పావుకప్పు 7. వెన్న- రెండు టీ స్పూన్లు 8. చాట్మసాల 9. ఉప్పు (రుచికి సరిపడా). తయారీ: 1. వేడినీళ్లలో స్వీట్కార్న్ ఉడికించాలి 2. పాన్ మీద వెన్న రాసి, స్వీట్కార్న్ గింజల్ని వేసి, ఒకటి లేదా రెండు నిమిషాలు వేగించాలి 3. బౌల్లో వేగించిన స్వీట్కార్న్ గింజల్ని తీసుకొని, దానిమ్మ గింజలు, ఉల్లిపాయ, టొమాటో ముక్కల్ని కలపాలి 4. నిమ్మరసం, తరిగిన కొత్తిమీర, కొద్దిగా చాట్మసాల, ఉప్పు చల్లుకుంటే భలే రుచిగా ఉంటుంది.
2
['tel']
క్యాప్సికమ్ పెరుగు పచ్చడి పచ్చడి ఎలా చేయాలి? సమాధానం లో కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఉండాలి.
క్యాప్సికమ్ పెరుగు పచ్చడి పచ్చడి కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసిన పదార్థాలు: 1. పెరుగు- పావు లీటరు 2. క్యాప్సికమ్- ఒకటి 3. నూనె- రెండు స్పూన్లు 4. పచ్చిమిర్చి- 2 5. పోపు గింజలు- తగినంత 6. అల్లం- తగినంత 7. ఉప్పు- తగినంత 8. పసుపు- తగినంత తయారు చేసే విధానం: 1. క్యాప్సికమ్ను సన్నగా తరగాలి 2. కడాయిలో నూనె కాగిన తరువాత ముక్కలు వేసి వేయించాలి 3. పెరుగులో నూరిన అల్లం పచ్చిమిర్చి, ఉప్పు వేసి కలపాలి 4. తర్వాత క్యాప్సికమ్ ముక్కలు కూడా కలిపి తిరగమోత వేస్తే క్యాప్సికమ్ పెరుగు పచ్చడి రెడీ.
5
['tel']
మొదటిసారి వంట చేసేవారికి చెప్పినట్టు నాకు తీపి కాకర పచ్చడి పచ్చడి ఎలా చెయ్యాలొ చెప్పు
తీపి కాకర పచ్చడి పచ్చడి కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసిన పదార్థాలు: 1. కాకరకాయలు- పావు కిలో 2. ఉల్లిపాయలు- 3 3. బెల్లం- తగినంత 4. ఉప్పు- తగినంత 5. పసుపు- తగినంత 6. కారం- తగినంత 7. నూనె- కాసింత. తయారు చేసే విధానం: 1. కాకరకాయల్ని సన్నగా తరిగి పెట్టుకోవాలి 2. చక్రాల్లా లేదా పొడుగ్గా అయినా పర్వాలేదు 3. బాండీలో నూనె వేసి కాగిన తరవాత ఈ కాకర ముక్కల్ని వేసి బాగా వేయించి పెట్టుకోవాలి 4. ఉల్లి ముక్కల్ని మెత్తగా గ్రైండ్ చేయాలి 5. ఓ బాండీలో కాస్త నూనెను వేడిచేసి ఉల్లిపాయల ముద్దను వేసి ఉడికించాలి 6. దీనికి బెల్లం, ఉప్పు, కారం వేసి మగ్గనివ్వాలి 7. బాగా వేగిన తరవాత వేయించిన కాకర ముక్కల్ని కలిపి రెండు నిమిషాల పాటు మగ్గించాలి 8. ఈ పచ్చడి కాస్త కారంగా, కాస్త తీపిగా భలే రుచిగా ఉంటుంది.
4
['tel']
దహీ కబాబ్ ఎలా తయారు చేస్తాం?
దహీ కబాబ్ కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలిసినవి: 1. హంగ్ యోగర్ట్ - ఒకటిన్నర కప్పు 2. సెనగపిండి - పావు కప్పు 3. కొత్తిమీర - ఒకకట్ట 4. పచ్చిమిర్చి - రెండు 5. ఉల్లిపాయ - ఒకటి 6. ఉప్పు - తగినంత 7. జీలకర్ర పొడి - ఒక టీస్పూన్(జీలకర్ర వేగించి పొడి చేసుకోవాలి) 8. నూనె - సరిపడా. తయారీ విధానం: 1. ఒక పాత్రలో నూనె కాకుండా మిగతా పదార్థాలన్నింటినీ వేసి బాగా కలియబెట్టి ఫ్రిజ్లో ఒక గంటపాటు పెట్టాలి 2. తరువాత మిశ్రమాన్ని చేతిలో కొద్దికొద్దిగా తీసుకుంటూ టిక్కీల మాదిరిగా ఒత్తుకుంటూ పాన్పై వేగించాలి 3. నూనె వేసుకుంటూ గోధుమరంగులోకి మారే వరకు రెండు వైపులా వేగించాలి 4. గ్రీన్ చట్నీతో వేడి వేడిగా దహీ కబాబ్స్ను అందించాలి.
6
['tel']
నేను క్యాబేజీ పకోడి చాలా రుచికరంగా ఉంటుంది అని విన్నాను. నాకు ఇది ఎలా చెయ్యాలో సంక్లిప్తంగా చెప్పు.
క్యాబేజీ పకోడి కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసిన పదార్థాలు: 1. క్యాబేజి- పావు కిలో ముక్క 2. శెనగపిండి- కప్పు 3. బియ్యం పిండి- పావు కప్పు 4. అల్లం 5. మిర్చిపేస్టు- స్పూను 6. ఉప్పు 7. పసుపు- తగినంత 8. పచ్చి మిర్చి- మూడు 9. కరివేపాకు- రెండు రెబ్బలు 10. కొత్తిమీర- కొంచెం 11. జీలకర్ర- అర స్పూను 12. నూనె- తగినంత తయారుచేసే విధానం: 1. క్యాబేజీని సన్నని ముక్కలుగా తరగాలి 2. ఓ బేసిన్లో ఈ ముక్కలు తీసుకుని ఉప్పు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర తరిగి బాగా కలపాలి 3. దీంట్లో బియ్యపు పిండి, శెనగ పిండి వేసి తగినంత నీరు పోసి కలపాలి 4. జారుగా లేదా గట్టిగా కలుపుకున్నా పర్వాలేదు 5. బాండీలో నూనె పోసి కాగిన తరవాత చిన్న చిన్న ముద్దలుగా వేసి బాగా వేయించి తీస్తే క్యాబేజీ పకోడి రెడీ.
3
['tel']
సాగో పొంగల్ ఘీ రోస్ట్ పనీర్ ఎలా తయారు చేస్తాం?
సాగో పొంగల్ ఘీ రోస్ట్ పనీర్ కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావాల్సిన పదార్థాలు: 1. పనీర్ - 100 గ్రా 2. నెయ్యి-20 మి.లీ 3. గుంటూరు కారం పొడి-20 గ్రా 4. ధనియాలు- 30 గ్రా 5. నల్ల మిరియాలు- 2గ్రా 6. జీరా - 1 గ్రా 7. కరివేపాకు- 5 గ్రా 8. నిమ్మ-1 9. పచ్చిమిర్చి-5 10. సగ్గుబియ్యం- 40 గ్రా 11. పెసరపప్పు- 40 గ్రా 12. పసుపు-2గ్రా 13. అల్లం- 5 గ్రా 14. ఉప్పు- 10 గ్రా 15. నల్లమిరియాల పొడి- 3గ్రా 16. కొత్తిమీర- 5 గ్రా 17. సగ్గుబియ్యం- 3గ్రా 18. ఆయిల్ - 12 మి.లీ. తయారీ విధానం: 1. ముందుగా సగ్గుబియ్యంను వేడి నీటిలో వేసి నానబెట్టాలి 2. తరువాత ఓ గిన్నెలో ధనియాలు, జీలకర్ర, బ్లాక్ పెప్పర్ కార్న్ను ముందుగా డ్రై రోస్ట్ చేయాలి 3. ఇప్పుడు నానబెట్టిన పచ్చిమిర్చి, రోస్టెడ్ స్పైసెస్ను మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి 4. ఇప్పుడు నెయ్యిలో ఈ పేస్ట్ను ఫ్రై చేయాలి 5. పనీర్ క్యూబ్స్, ఉప్పు వేసి నెయ్యిలో ఫ్రై చేయాలి 6. రెండు గంటల పాటు సగ్గు బియ్యం నాన బెట్టాలి 7. ఈ నీటిని వడగట్టి పక్కన పెట్టుకోవాలి 8. ఓ గిన్నెలో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, నల్లమిరియాలు వేసి వేగించడంతో పాటుగా అల్లం, పచ్చిమిర్చి, పసుపు వేసి కలియతిప్పి, దీనిలో పెసరపప్పు, సగ్గు బియ్యం, తగినంత నీరు కలపాలి 9. సన్నటి మంటపై ఉడకనిచ్చి నెయ్యి, కొత్తిమీర ఆకులు వేయాలి 10. ఈ సాగో పొంగల్ పై పనీర్ ఘీ రోస్ట్ వేసి సర్వ్ చేసుకోవాలి.
6
['tel']
బ్రొకోలి పనీర్ పీనట్ శాండ్విచ్ ఎలా చేయాలి? సమాధానం లో కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఉండాలి.
బ్రొకోలి పనీర్ పీనట్ శాండ్విచ్ కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలిసనవి: 1. వీట్ బ్రౌన్ బ్రెడ్ - నాలుగు 2. బ్రొకోలి - ఒకటి 3. పనీర్ - 150గ్రా 4. వేగించిన వేరుశనగలు - నాలుగు టేబుల్స్పూన్లు 5. వెల్లుల్లి రెబ్బలు - నాలుగు 6. రెడ్ ఛిల్లీ సాస్ - రెండు టేబుల్స్పూన్లు 7. మిరియాల పొడి - ఒక టీస్పూన్ 8. ఉప్పు - రుచికి తగినంత 9. వెన్న - రెండు టేబుల్స్పూన్లు 10. నూనె - సరిపడా. తయారీ విధానం: 1. బ్రొకోలిని ముక్కలుగా కట్ చేసుకోవాలి 2. పనీర్ను కట్ చేసి పెట్టుకోవాలి 3. ఒక పాత్రలో బ్రొకోలి ముక్కలు తీసుకుని ఒక కప్పు వేడి నీళ్లు పోయాలి 4. స్టవ్పై పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక వెల్లుల్లి రెబ్బలు వేయాలి 5. కాసేపు వేగిన తరువాత వేడినీళ్లలో నుంచి బ్రొక్కోలి ముక్కలు తీసి పాన్లో వేయాలి 6. కాసేపు వేగించాలి 7. ఎక్కువ సేపువేగిస్తే బ్రొకోలిలో ఉన్న పోషకాలు నశిస్తాయి 8. తరువాత పనీర్ ముక్కలు, మిరియాలు, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి 9. స్టవ్పై నుంచి దింపుకొన్న తరువాత వేగించిన వేరుశనగలు వేసి కలపాలి 10. శాండ్విచ్ మేకర్ను ప్రీహీట్ చేయాలి 11. ఇప్పుడు బ్రెడ్ ముక్కలకు వెన్న రాసుకోవాలి 12. ఒక బ్రెడ్ ముక్కపై బ్రొకోలి మిశ్రమం పెట్టి, మరో బ్రెడ్ ముక్కను పైన పెట్టి శాండ్విచ్ మేకర్లో గోధుమరంగులోకి మారే వరకు టోస్ట్ చేయాలి 13. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఏదైనా స్మూతీతో లేదా జ్యూస్తో కలిపి సర్వ్ చేసుకోవాలి.
5
['tel']
నేను కార్న్ పనీర్ సమోసా చాలా రుచికరంగా ఉంటుంది అని విన్నాను. నాకు ఇది ఎలా చెయ్యాలో సంక్లిప్తంగా చెప్పు.
కార్న్ పనీర్ సమోసా కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. ఉడికించిన స్వీట్కార్న్- సగం కప్పు 2. తరిగిన పనీర్- సగం కప్పు 3. చిన్న ఉల్లిపాయ 4. పచ్చిమిర్చి- రెండు 5. క్యాప్సికమ్ ఒకటి 6. కొత్తిమీర- రెండు టేబుల్ స్పూన్లు 7. ప్రాసెస్డ్ ఛీజ్- సగం కప్పు 8. రెడ్చిల్లీ ఫ్లేక్స్- రెండు టేబుల్ స్పూన్లు 9. సమోసా పట్టి 10. పిండి 11. నూనె 12. ఉప్పు తగినంత. తయారీ విధానం: 1. ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో కార్న్, పనీర్ పేస్ట్, ఉల్లిపాయ, కాప్సికమ్, కొత్తిమీర, ప్రాసెస్డ్ ఛీజ్ పేస్ట్ వేసి బాగా కలపాలి 2. చివరలో రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు వేసి కలపాలి 3. ఇప్పుడు సమోసా పట్టి తీసుకొని మధ్యలో ఈ మిశ్రమాన్ని వేయాలి 4. సమోసా పట్టి అంచుల వెంబడి పేస్ట్లా చేసుకున్న పిండిని అద్దుతూ సమోసా ఆకారంలో మడవాలి 5. తరువాత కడాయిలో నూనె వేగించి, సమోసాలను వేగించాలి 6. ఈ టేస్టీ కార్న్ పనీర్ సమోసాలను కొత్తిమీర చట్నీతో తినాలి.
3
['tel']
మఖానా కర్రీ ఎలా తయారు చేస్తారో క్లుప్తంగా ఇవ్వండి.
మఖానా కర్రీ కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. మఖానా (తామర గింజలు) - కప్పు 2. పచ్చి బఠాణీ - అరకప్పు 3. ఉల్లిపాయ - ఒకటి 4. టొమాటో ప్యూరీ - కప్పు 5. కారం - రెండు టీస్పూన్లు 6. ధనియాల పొడి - టేబుల్స్పూన్ 7. పసుపు - అర టీస్పూన్ 8. గరంమసాలా - టీస్పూన్ 9. జీలకర్ర - పావు టీస్పూన్ 10. నూనె - రెండు టేబుల్స్పూన్లు 11. ఉప్పు - తగినంత 12. కొత్తిమీర - గార్నిష్ కోసం 13. (పేస్టు కోసం) ఉల్లిపాయ - ఒకటి 14. అల్లం - చిన్నముక్క 15. వెల్లుల్లి - ఐదు రెబ్బలు 16. గసగసాలు - ఒక టీస్పూన్ 17. జీడిపప్పు - ఐదు పలుకులు 18. నూనె - సరిపడా. తయారీ: 1. ముందుగా పేస్టు తయారీ కోసం పాన్లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఉల్లిపాయలు వేసి వేగించాలి 2. అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు వేయాలి 3. బాగా వేగిన తరువాత స్టవ్ పైనుంచి దింపాలి 4. గసగసాలు, జీడిపప్పు వేసి కలియబెట్టాలి 5. చల్లారిన తరువాత మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి 6. కొద్దిగా నీళ్లు పొసి మెత్తటి పేస్టులా చేసుకుని పక్కన పెట్టుకోవాలి 7. ఇప్పుడు అదే పాన్లో తామరగింజలు వేసి చిన్నమంటపై వేగించాలి 8. కాసేపు వేగిన తరువాత ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టాలి 9. అదే పాన్లో నూనె వేసి వేడి అయ్యాక జీలకర్ర, ఉల్లిపాయలు వేసి వేగించాలి 10. తరువాత రెడీ చేసి పెట్టుకున్న పేస్టు వేసి చిన్నమంటపై రెండు నిమిషాలు ఉడకనివ్వాలి 11. కొద్దిసేపటికి టొమాటో ప్యూరీ, కారం, ధనియాలపొడి, పసుపు వేసి కలియబెట్టాలి 12. మూతపెట్టి చిన్నమంటపై ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి 13. బఠాణీలు వేసి తగినంత ఉప్పు చల్లుకుని కాసిన్ని నీళ్లు పోసి మరో మూడు నాలుగు నిమిషాలు ఉడికించాలి 14. ఇప్పుడు వేగించి పెట్టుకున్న తామర గింజలు వేయాలి 15. చిన్నమంటపై మరికాసేపు ఉడకనివ్వాలి 16. చిక్కటి గ్రేవీ తయారవుతుంది 17. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని దింపాలి 18. ఈ కూరచపాతీలోకి లేదా పులావ్లోకి రుచిగా ఉంటుంది.
1
['tel']
నేను మినీ సోయా ఊతప్పం చాలా రుచికరంగా ఉంటుంది అని విన్నాను. నాకు ఇది ఎలా చెయ్యాలో సంక్లిప్తంగా చెప్పు.
మినీ సోయా ఊతప్పం కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావల్సిన పదార్థాలు: 1. 1/2 కప్పు సోయా మిల్క్,1 కప్పు సెమోలినా రవ్వ 2. సన్నగా తరిగిన ఉల్లి 3. టమోటా 1/2 కప్పు చొప్పున 4. కొత్తిమేర 5. పచ్చిమిర్చి 2 చెంచాలు చొప్పున 6. రుచికి తగినంత ఉప్పు 7. నూనె. తయారీ విధానం: 1. సోయా మిల్క్, సెమోలినా ఒక బౌల్లో పోసి, బాగా కలపాలి 2. పది నిమిషాల తరువాత కట్ చేసిన ఉల్లి, టమోటా, కొత్తిమేర, పచ్చిమిర్చితో పాటు ఉప్పు వేసి మళ్లీ కలపాలి 3. స్టౌవ్పై తవా పెట్టి, వేడెక్కిన తరువాత దానిపై నూనె రాయాలి 4. గరిటెతో కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని మూడు ఇంచుల వృత్తాకారంలో తవాపై వేయండి 5. ఒకేసారి మూడు. 6. నాలుగు ఊతప్పాలు చేసుకోవచ్చు 7. ఒకవైపు కాలిన తరువాత ఊతప్పాన్ని రెండో వైపు తిప్పి, కాస్త నూనె వేసి, కాల్చాలి.
3
['tel']
క్యారెట్ రైస్ ఎలా చేయాలి? సమాధానం లో కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఉండాలి.
క్యారెట్ రైస్ కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసిన పదార్థాలు: 1. బియ్యం - కప్పు 2. ఆయిల్ - టేబుల్ స్పూన్ 3. కరివేపాకు - పిడికెడు 4. కొత్తిమీర - పిడికెడు 5. యాలకులు - 4 6. ఉల్లిపాయ - పెద్దది 1 7. అల్లం 8. వెల్లుల్లి పేస్ట్ - టేబుల్ స్పూన్ 9. క్యారెట్లు - పెద్దవి 2 10. కారం - రుచికి తగినంత 11. ఉప్పు - రుచికి తగినంత 12. వేయించిన పల్లీలు - పిడికెడు. తయారుచేసే విధానం: 1. ముందుగా అన్నం పొడిగా ఉండేలా వండుకోని చల్లారనివ్వాలి 2. కడాయిలో కొంచెం నూనె వేసి వేడయ్యాక యాలకులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేగించాలి 3. దానికి అల్లం, వెల్లుల్లి పేస్ట్ కలిపి వాసన పోయేదాకా వేగించాలి 4. క్యారెట్లను తురుముగా లేదా ముక్కలుగా కోసి కడాయిలో వేసి రెండు నిమిషాలు దోరగా వేగించిన తరువాత ఉప్పు చల్లి మూతపెట్టాలి 5. సన్నమంట మీద క్యారెట్ ఉడికిన తర్వాత దానికి తగినంత కారం, కొత్తిమీర చల్లుకోవాలి 6. తరువాత చల్లారిన అన్నాన్ని వేసి బాగా కలియబెట్టి కొంచెం ఉప్పు చల్లాలి 7. కావాలంటే నిమ్మరసం కూడా పిండుకోవచ్చు 8. ఆఖరున వేగించిన పల్లీలు కలుపుకోవాలి 9. అంతే క్యారెట్ రైస్ సిద్ధం 10. పెరుగు అప్పడాలు, రైతాతో ప్లేట్ లో వడ్డించుకోవచ్చు 11. చిన్నపిల్లలయితే ఇష్టంగా తింటారు.
5
['tel']
ఆల్మండ్ కోఫ్తా ఎలా తయారు చేస్తాం?
ఆల్మండ్ కోఫ్తా కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి : 1. బంగాళదుంపలు - నాలుగు 2. జాజికాయ పొడి - చిటికెడు 3. పాలు - రెండు టేబుల్స్పూన్లు 4. బాదం పలుకులు - ముప్పావు కప్పు 5. పిండి - ఒక కప్పు 6. కోడిగుడ్లు - మూడు 7. ఉప్పు - కొద్దిగా 8. మిరియాల పొడి - అర టీస్పూన్ 9. బ్రెడ్ ముక్కలు - కొన్ని. తయారీ : 1. ముందుగా బంగాళదుంపలు ఉడికించాలి 2. పొట్టు తీసి గుజ్జుగా చేసి ఒక పాత్రలోకి తీసుకోవాలి 3. అందులో బాదం పలుకులు, ఉప్పు, మిరియాలపొడి, జాజికాయ పొడి, పాలు, పిండి, రెండు కోడిగుడ్లు కొట్టి వేసి బాగా కలియబెట్టాలి 4. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్లో పావుగంట పాటు పెట్టాలి 5. తరువాత కోఫ్తాలుగా కట్ చేసుకోవాలి 6. ఒక ప్లేటులో పొడి పిండి, మరొక ప్లేటులో కోడిగుడ్డు సొన, ఇంకో ప్లేటులో బ్రెడ్ ముక్కలు తీసుకోవాలి 7. ఒక్కో కోఫ్తాను తీసుకుంటూ పిండిలో అద్ది, కోడిగుడ్డు సొనలో అద్దాలి 8. తరువాత బ్రెడ్ముక్కలపై దొర్లించాలి 9. ఈ కోఫ్తాలను ప్రీ హీట్ ఓవెన్లో పెట్టి ఉడికించి వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి.
6
['tel']
వాంగీబాత్ ఎలా చేయాలి? సమాధానం లో కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఉండాలి.
వాంగీబాత్ కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసిన పదార్థాలు: 1. సజ్జ రవ్వ - 150 గ్రా. 2. వంకాయలు - 70 గ్రా. 3. ఉల్లిపాయలు - 15 గ్రా. 4. పచ్చిమిర్చి - 15 గ్రా. 5. పసుపు - 2 గ్రా. 6. యాలకులు - 5 గ్రా. 7. చెక్క - 5 గ్రా. 8. జీలకర్ర - 5 గ్రా. 9. అల్లం తురుము - ఒక స్పూను 10. ఉప్పు - రుచికి సరిపడా 11. నూనె - 10 గ్రా. 12. అల్లం వెల్లులి ముద్ద - 10 గ్రా. తయారీ విధానం: 1. బాణలిలో కొంచెం నెయ్యి వేసి రవ్వను దోరగా వేగనిచ్చి తీసివేయాలి 2. అదే పాత్రలో నూనె వేసి యాలకులు, చెక్క, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, తురిమిన అల్లం, వంకాయ తరుగు వేసి వేగనివ్వాలి 3. అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసి కాసేపు మూత పెట్టి ఉంచాలి 4. తరువాత 4 కప్పుల నీళ్ళు పోసి రుచికి తగినంత ఉప్పు, రవ్వ వేసి మూత పెట్టి 10 నిమిషాలు ఉడకనివ్వాలి.
5
['tel']
మీరు చుక్కకూర పరోటా తయారు చెయ్యడానికి ఎటువంటి తిండి పదార్ధాలు వాడుతురు మరియు ఏ విధముగా చేస్తారో వివరణ ఇవ్వండి.
చుక్కకూర పరోటా కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. చుక్కకూర - నాలుగు కట్టలు 2. ఉప్పు - రుచికి తగినంత 3. కారం - సరిపడా 4. జీలకర్ర పొడి - అర టీస్పూన్ 5. ధనియాల పొడి - అర టీస్పూన్ 6. గోధుమపిండి - ఒక కప్పు 7. నూనె - రెండు స్పూన్లు. తయారీవిధానం: 1. ముందుగా చుక్కకూరను శుభ్రంగా కడిగి కట్ చేయాలి 2. ఒక పాన్ తీసుకొని ఒక స్పూన్ నూనె వేసి కాస్త వేడి అయ్యాక జీలకర్ర పొడి, ధనియాల పొడి వేగించాలి 3. తరువాత చుక్కకూర వేసి మరికాసేపు వేగించాలి 4. రెండు నిమిషాల పాటు వేగాక దింపుకోవాలి 5. ఇప్పుడు గోధుమపిండి, కారం, ఉప్పు వేసి మెత్తటి మిశ్రమం అయ్యేలా కలపాలి 6. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పరోటాలుగా ఒత్తుకోవాలి 7. పరోటాలకు నూనె రాస్తూ పెనంపై రెండు వైపులా కాల్చాలి 8. చట్నీతో తింటే ఈ పరోటాలు రుచిగా ఉంటాయి.
2
['tel']
నేను ప్రాన్స్ నూడిల్స్ చాలా రుచికరంగా ఉంటుంది అని విన్నాను. నాకు ఇది ఎలా చెయ్యాలో సంక్లిప్తంగా చెప్పు.
ప్రాన్స్ నూడిల్స్ కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావాల్సిన పదార్థాలు: 1. వెల్లుల్లి- 4 టీస్పూన్ (సన్నగా తరిగినవి) 2. పచ్చిమిరపకాయలు- 2 (సన్నగా తరగాలి) 3. రెడ్ చిల్లీ ఫ్లేక్స్- 2 టీస్పూన్లు 4. నూనె- 3 టీస్పూన్లు 5. తరిగిన కొత్తిమీర- 1 స్పూన్ 6. శుభ్రం చేసిన రొయ్యలు- 12 7. ఎగ్నూడిల్స్- కప్పు (ఉడకబెట్టినవి) 8. ఉప్పు- రుచికి తగినంత 9. సోయాసాస్- టీ స్పూన్ 10. రెడ్ చిల్లీ సాస్- ఒకటిన్నర టీస్పూన్ 11. బ్లాక్పెప్పర్ పౌడర్- 1 టీస్పూన్ 12. వెనిగర్- టీస్పూన్ 13. స్ర్పింగ్ ఆనియన్ గ్రీన్స్- 2 స్టాక్స్ (తరిగినవి). తయారీ విధానం: 1. ఒక కప్పులో ప్రాన్స్ తీసుకుని అందులోకి గార్లిక్తో పాటు మిరపపొడి వేయాలి 2. ఆ తర్వాత ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి 3. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె వేయాలి 4. కాస్త వేడయ్యాక రొయ్యలు వేయాలి 5. మంట పెంచి బాగా వేగించాలి 6. వేగిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకుని పక్కనబెట్టుకోవాలి 7. ఆ తర్వాత మరో ప్యాన్లో నూనె వేసి పచ్చి మిరపకాయలు వేసి వేయిస్తూ మధ్యలో గార్లిక్, కొత్తిమీర వేయాలి 8. గార్లిక్ బంగారు రంగు వచ్చాక నూడిల్స్ వేయాలి 9. గరిటెతో తిప్పుతూ సోయాసాస్, రెడ్ చిల్లీసాస్ కొద్దిగా వేయాలి 10. పెప్పర్ పౌడర్ వేసి మిక్స్ చేస్తుండాలి 11. దీనికి రొయ్యలు కలపాలి 12. బాగా గరిటెతో కలియ బెడుతుండాలి 13. ఆ తర్వాత వెనిగర్ వేయాలి 14. చిల్లి గార్లిక్ ప్రాన్స్ నూడిల్స్ రెడీ 15. దీన్ని స్ర్పింగ్ ఆనియన్ గ్రీన్స్ వేసుకుని తినాలి.
3
['tel']
నేను కోడి కారమ్ చిప్స్ చాలా రుచికరంగా ఉంటుంది అని విన్నాను. నాకు ఇది ఎలా చెయ్యాలో సంక్లిప్తంగా చెప్పు.
కోడి కారమ్ చిప్స్ కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావాల్సిన పదార్థాలు: 1. నానబెట్టడం మరియు ఫ్రై కోసం... చికెన్ బ్రెస్ట్ (సన్నటి ముక్కలు)-200 గ్రా 2. జొన్నపిండి - 20 గ్రాములు 3. అల్లం వెల్లుల్లి పేస్ట్- 5 గ్రా 4. కారం- 15 గ్రా 5. గరం మసాలా - 5 గ్రా 6. జీలకర్ర పొడి- 5గ్రా 7. ఉప్పు- తగినంత 8. కోడికారం పొడి కోసం... చాట్ మసాలా - 25 గ్రా 9. ధనియాల పొడి - 25 గ్రా 10. జీలకర్ర పొడి- 25 గ్రా 11. కారం పొడి- 25 గ్రా తయారీ విధానం: 1. ఓ గిన్నెలో నీరు తీసుకుని, మారినేషన్ కోసం పైన వెల్లడించిన పదార్థాలన్నీ తీసుకుని మెత్తగా ముద్దలా చేసుకోవాలి 2. ఈ ముద్దలో చికెన్ కూడా కలిపి 10 నిమిషాల పాటు నానబెట్టాలి 3. ఇప్పుడు ఓ కడాయిలో నూనె తీసుకుని ఈ చికెన్ ముక్కలను వేసి బంగారు వర్ణం వచ్చే వరకూ వేయించాలి 4. కోడికారం కోసం వెల్లడించిన పదార్థాలన్నీ తీసుకుని గ్రైండింగ్ చేయాలి 5. ఈ కారాన్ని వేయించిన చికెన్ ముక్కలపై చల్లుకుని, వేయించిన కరివేపాకు జోడించి సర్వ్ చేసుకోవాలి.
3
['tel']
భునా యాతా నల్లీ బిర్యానీ ఎలా తయారు చేస్తారో క్లుప్తంగా ఇవ్వండి.
భునా యాతా నల్లీ బిర్యానీ కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావాల్సిన పదార్థాలు: 1. మటన్ నల్లీ తయారీ కోసం... మటన్ నల్లీ - 2 పీస్లు 2. రిఫైండ్ ఆయిల్ - తగినంత 3. ఉల్లిపాయలు (తరిగినది)- 100 గ్రాములు 4. అల్లం వెల్లుల్లి పేస్ట్ - 20 గ్రాములు 5. కారం- 10 గ్రా. 6. పెరుగు- 40 గ్రా 7. గరం మసాలా పొడి- 5 గ్రాములు 8. జీలకర్ర పొడి - 5 గ్రాములు 9. ధనియాల పొడి - 8 గ్రాములు 10. ఉప్పు - తగినంత 11. బిర్యానీ రైస్ కోసం... బాసుమతి బియ్యం - 150 గ్రాములు 12. రిఫైండ్ ఆయిల్ - తగినంత 13. షా జీరా - 5 గ్రాములు 14. యాలికలు - 2 15. అనాసపువ్వు - 1 16. నల్లమిరియాలు- 5 గ్రాములు 17. బిర్యానీ ఆకు- 1 18. పాలు - ఒక టేబుల్ స్పూన్ 19. ఉప్పు- తగినంత 20. నిమ్మరసం - తగినంత 21. నీరు -పావు లీటరు తయారీ విధానం: 1. (మటన్ నల్లీ సిద్ధం చేయడం)ఓ పాన్లో నూనె వేసి వేడి చేయాలి 2. అనంతరం ఉల్లిపాయలు వేసి గోధుమ రంగు వచ్చే వరకూ వేయించాలి 3. ఇప్పుడు మటన్ నల్లీ వేసి కొన్ని నిమిషాలు మగ్గనివ్వాలి 4. అనంతరం ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా దినుసులన్నీ కూడా వేసి, బాగా కలియతిప్పాలి 5. ఓ నిమిషం మగ్గనిచ్చి దానికి రెండు కప్పుల నీరు జొడించి సన్నటి సెగపై 20-25 నిమిషాలు ఉడికించాలి 6. నీరు ఇంకి చిక్కబడిన తరువాత పాన్ పొయ్యిమీద నుంచి దింపి పక్కన పెట్టాలి.(బిర్యానీ రైస్ తయారీ) బాస్మతి బియ్యం నీటిలో అరగంట నానబెట్టి, అనంతరం నీటిని బయటకు వదిలేయాలి 7. మందపాటి అడుగు కలిగిన పాన్ తీసుకుని దానిలో నూనె వేసి వేడి చేయాలి 8. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా దినుసులన్నీ కూడా జోడించి, వేయించాలి 9. ఇప్పుడు నానబెట్టిన బియ్యం వేసి, నెమ్మదిగా పాత్రలో ఓ నిమిషం బాగా కలియతిప్పాలి 10. ఆ తర్వాత నీళ్లు, పాలు పోయాలి 11. బియ్యం నాణ్యతను బట్టి నీరు ఎక్కువ లేదంటే తక్కువ కలపవచ్చు 12. ఇప్పుడు నిమ్మరసం చిలకరించి, పాన్ మూత మూసివేయాలి 13. బియ్యం ఉడికే వరకూ ఉంచాలి 14. బియ్యం ఉడికిన తరువాత నల్లీ మసాలా, రైస్ రెండూ మిక్స్ చేసి, వేయించిన ఉల్లిపాయలు, జీడిపప్పు అలంకరించి సర్వ్ చేసుకోవాలి.
1
['tel']
గోలిచినా కోడి వింగ్స్ ఎలా చేయాలి? సమాధానం లో కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఉండాలి.
గోలిచినా కోడి వింగ్స్ కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావాల్సిన పదార్థాలు: 1. నానబెట్టి- ఫ్రై చేసేందుకు... చికెన్ వింగ్స్ -240గ్రాములు 2. కార్న్ ఫ్లోర్ - 10 గ్రాములు 3. గుడ్డు- ఒకటి 4. కారం - 5గ్రా 5. ధనియాల పొడి - 5గ్రా 6. జీలకర్ర పొడి- 5 గ్రాములు 7. అల్లం వెల్లుల్లి 8. పేస్ట్ - 10 గ్రాములు 9. నీరు - తగినంత 10. రిఫైండ్ ఆయిల్ - పావు లీటరు 11. గోలిచినా కోడి వింగ్స్ తయారీ కోసం... రిఫైండ్ ఆయిల్ - తగినంత 12. కరివేపాకు - 2గ్రాములు 13. వెల్లుల్లి - 5 గ్రాములు 14. ఉల్లిపాయలు - 10గ్రా 15. కారం పొడి - 5 గ్రాములు 16. జీలకర్ర పొడి - 5 గ్రాములు 17. శనగపిండి - 15 గ్రాములు. తయారీ విధానం: 1. పైన పేర్కొనబడిన పదార్దాలను ఓ గిన్నెలో తీసుకుని చికెన్ ను కూడా కలిపి ఓ గంట నానబెట్టాలి 2. ఇప్పుడు ఓ నాన్ స్టిక్ పాన్లో నూనె వేసి వేడి చేయాలి 3. ఈ చికెన్ను బంగారు వర్ణం వచ్చే వరకూ బాగా వేయించాలి 4. ఇప్పుడు మరో నాన్ స్టిక్ పాన్ తీసుకుని కొద్దిగా నూనె వేసి, దానిలో వెల్లుల్లి జోడించి బంగారు వర్ణం వచ్చే వరకూ వేయించాలి 5. ఇప్పుడు ఉల్లిపాయలు జోడించి వేయించిన తరువాత మసాలా పొడులు కలపాలి 6. ఇప్పుడు ముందుగా వేయించిన చికెన్ కలిపి ఆ ముక్కలకుమసాలా బాగా పట్టే వరకూ తిప్పాలి 7. చివరలో శెనగపిండి కూడా జోడించి, చికెన్ ముక్కలకు ఈ పొడి పట్టేంత వరకూ తిప్పాలి 8. వేడిగా ఉన్నప్పుడే వేయించిన కరివేపాకు జోడించి కొబ్బరి తురుము కూడా జోడిస్తే ఇంకాస్త రుచిగా ఉంటుంది.
5
['tel']
తలకాయ కూర ఎలా చేయాలి? సమాధానం లో కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఉండాలి.
తలకాయ కూర కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. మేక తలకాయ మాంసం - ఒక కేజీ 2. ఉల్లిపాయలు - రెండు 3. కారం - నాలుగు టీస్పూన్లు 4. కొబ్బరి పొడి - మూడు టీస్పూన్లు 5. ధనియాల పొడి - రెండు టీస్పూన్లు 6. పచ్చిమిర్చి - రెండు 7. వెల్లుల్లి రెబ్బలు - ఐదారు 8. పసుపు - ఒక టీస్పూన్ 9. జీలకర్ర - అర టీస్పూన్ 10. అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్ 11. లవంగాలు - ఎనిమిది 12. సాజీర - అర టీస్పూన్ 13. మిరియాలు - అరటీస్పూన్ 14. దాల్చిన చెక్క - కొద్దిగా 15. యాలకులు - నాలుగు 16. నూనె - సరిపడా 17. ఉప్పు - రుచికి తగినంత. తయారీ: 1. ముందుగా మసాలా తయారు చేసుకోవాలి 2. మిక్సీలో కొద్దిగా ఉల్లిపాయలు, జీలకర్ర, ధనియాల పొడి, కొబ్బరి పొడి, వెల్లుల్లి రెబ్బలు, మిరియాలు, దాల్చినచెక్క, లవంగాలు, సాజీర వేసి మెత్తగా పేస్టులా చేయాలి 3. స్టవ్పై కుక్కర్ పెట్టి నూనె వేసి వేడి అయ్యాక ఉల్లిపాయలు వేసి వేగించాలి 4. కాసేపు వేగిన తరువాత పచ్చిమిర్చి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కలపాలి 5. ఇప్పుడు తలకాయ మాంసం వేసి మూత పెట్టి చిన్నమంటపై పది నిమిషాలు ఉడికించాలి 6. తరువాత తయారుచేసి పెట్టుకున్న మసాలా పేస్టు వేయాలి 7. బాగా కలిపి మూత పెట్టి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి 8. తగినంత కారం, ఉప్పు వేసి కలియబెట్టాలి 9. మాంసం ఉడకడానికి తగినన్ని నీళ్లు పోయాలి 10. కుక్కర్ మూత పెట్టి ఆరు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి 11. ఆవిరి పోయాక మూత తీయాలి 12. కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి.
5
['tel']